ETV Bharat / bharat

పాక్​కు భారత్​ వార్నింగ్- ఇద్దరు అధికారులు విడుదల

పాకిస్థాన్​లోని భారత హైకమిషన్​లో అదృశ్యమైన ఇద్దరు అధికారులు తిరిగి విధుల్లో చేరారు. వీరి అదృశ్యంపై భారత్​ తీవ్రంగా స్పందించిన కొద్ది గంటల్లోనే పాక్​ ప్రభుత్వం వీరిని విడుదల చేసింది. అంతకుముందు పాక్ అధికారులు వీరిని అరెస్టు చేశారని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి.

author img

By

Published : Jun 15, 2020, 7:42 PM IST

Updated : Jun 15, 2020, 8:58 PM IST

India lodges protest with Pak over reported arrest of 2 Indian High Commission staffers in Islamabad
పాక్​లో ఇద్దరు అధికారుల అరెస్టుపై తీవ్రంగా స్పందించిన భారత్​

పాకిస్థాన్​లోని భారత హైకమిషన్​లో అదృశ్యమైన ఇద్దరు అధికారులు తిరిగి విధుల్లో చేరారు. అక్కడి పోలీసులు వీరిని అరెస్టు చేశారని వచ్చిన వార్తలపై భారత్​ తీవ్రంగా స్పందించింది. దిల్లీలోని పాక్ దౌత్య అధికారికి సమన్లు జారీ చేసి నిరసన తెలిపింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే వీరిని పాక్​ ప్రభుత్వం విడుదల చేసింది.

ఇస్లామాబాద్​లోని భారత హైకమిషన్​లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ అధికారులు సోమవారం ఉదయం అదృశ్యమయ్యారు. హైకమిషన్​ కార్యాలయం నుంచి వాహనంలో బయల్దేరిన వారు గమ్యస్థానాన్ని చేరుకోలేదు. అయితే వీరిని 'హిట్​ అండ్​ రన్'​ కేసులో పాక్ అధికారులు అరెస్టు చేశారని ఆ దేశ మీడియాలో వార్తలొచ్చాయి.

వారికేమైనా జరిగితే..

అరెస్టయిన ఇద్దరు భారత అధికారులను విచారించవద్దని, వాళ్లను హింసించడానికి వీల్లేదని పాక్​ దౌత్య అధికారికి జారీ చేసిన డీమార్చిలో పేర్కొంది భారత్​. వారి భద్రతకు పాక్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

అరెస్టయిన ఇద్దరు అధికారులను కారుతో సహా భారత హైకమిషన్​​ కార్యాలయంలో తక్షణమే అప్పగించాలని పాక్ దౌత్య అధికారికి భారత్​ తేల్చి చెప్పినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

అప్పటి నుంచే...

భారత్​లోని పాక్ హైకమిషన్​​ కార్యాలయంలో ఇద్దరు అధికారులు గూఢచర్యానికి పాల్పడుతున్నారని వారిని బహిష్కరించింది భారత్​. సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని వారు లీక్ చేస్తున్నారని చర్యలకు ఉపక్రమించింది.

ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఇస్లామాబాద్​లోని భారత హైమిషన్ కార్యాలయంలోని అధికారులను వేధిస్తున్నాయి పాక్ సంస్థలు. వారిలో ఇప్పుడు అదృశ్యమైన భారత సీనియర్​ దౌత్యవేత్త గౌరవ్​ అహ్లువాలియా కూడా ఉన్నారు.

అహ్లువాలియా కారును ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్​ఐ సభ్యులు వెంబడించిన కొద్దిరోజుల అనంతరం ఈ పరిణామాలు జరగడం గమనార్హం.

ఇదీ చూడండి: పాక్​లో భారత 'హైకమిషన్​' అధికారులు అదృశ్యం

పాకిస్థాన్​లోని భారత హైకమిషన్​లో అదృశ్యమైన ఇద్దరు అధికారులు తిరిగి విధుల్లో చేరారు. అక్కడి పోలీసులు వీరిని అరెస్టు చేశారని వచ్చిన వార్తలపై భారత్​ తీవ్రంగా స్పందించింది. దిల్లీలోని పాక్ దౌత్య అధికారికి సమన్లు జారీ చేసి నిరసన తెలిపింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే వీరిని పాక్​ ప్రభుత్వం విడుదల చేసింది.

ఇస్లామాబాద్​లోని భారత హైకమిషన్​లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ అధికారులు సోమవారం ఉదయం అదృశ్యమయ్యారు. హైకమిషన్​ కార్యాలయం నుంచి వాహనంలో బయల్దేరిన వారు గమ్యస్థానాన్ని చేరుకోలేదు. అయితే వీరిని 'హిట్​ అండ్​ రన్'​ కేసులో పాక్ అధికారులు అరెస్టు చేశారని ఆ దేశ మీడియాలో వార్తలొచ్చాయి.

వారికేమైనా జరిగితే..

అరెస్టయిన ఇద్దరు భారత అధికారులను విచారించవద్దని, వాళ్లను హింసించడానికి వీల్లేదని పాక్​ దౌత్య అధికారికి జారీ చేసిన డీమార్చిలో పేర్కొంది భారత్​. వారి భద్రతకు పాక్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

అరెస్టయిన ఇద్దరు అధికారులను కారుతో సహా భారత హైకమిషన్​​ కార్యాలయంలో తక్షణమే అప్పగించాలని పాక్ దౌత్య అధికారికి భారత్​ తేల్చి చెప్పినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

అప్పటి నుంచే...

భారత్​లోని పాక్ హైకమిషన్​​ కార్యాలయంలో ఇద్దరు అధికారులు గూఢచర్యానికి పాల్పడుతున్నారని వారిని బహిష్కరించింది భారత్​. సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని వారు లీక్ చేస్తున్నారని చర్యలకు ఉపక్రమించింది.

ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఇస్లామాబాద్​లోని భారత హైమిషన్ కార్యాలయంలోని అధికారులను వేధిస్తున్నాయి పాక్ సంస్థలు. వారిలో ఇప్పుడు అదృశ్యమైన భారత సీనియర్​ దౌత్యవేత్త గౌరవ్​ అహ్లువాలియా కూడా ఉన్నారు.

అహ్లువాలియా కారును ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్​ఐ సభ్యులు వెంబడించిన కొద్దిరోజుల అనంతరం ఈ పరిణామాలు జరగడం గమనార్హం.

ఇదీ చూడండి: పాక్​లో భారత 'హైకమిషన్​' అధికారులు అదృశ్యం

Last Updated : Jun 15, 2020, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.