ETV Bharat / bharat

'నేను చెప్పేది ఎవరూ పట్టించుకోరు ఎందుకు?'

author img

By

Published : Mar 17, 2020, 3:24 PM IST

ఆర్థిక పరంగా దేశానికి ఎదురయ్యే సమస్యలపై తాను ఎంత చెబుతున్నా, ఎన్ని విధాలుగా హెచ్చరిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు రాహుల్​ గాంధీ. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల వల్ల కరోనాతో పాటు ఆర్థిక వినాశనాన్ని ఎదుర్కొనేందుకు భారతీయులు సిద్ధంగా ఉండాలన్నారు.

govt-not-clear-about-what-they-have-to-do-rahul-gandhi
'నేను చెప్పేది ఎవరూ పట్టించుకోరు ఎందుకు?'

కరోనా వైరస్​తో పాటు ఆర్థికపరంగా ఎదురయ్యే వినాశనాన్ని ఎదుర్కొనేందుకు భారతీయులు సిద్ధంగా ఉండాలని సూచించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. తాను ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫలితంగా రానున్న 6 నెలల పాటు ప్రజలు తీవ్ర కష్టాన్ని ఎదుర్కొంటారన్నారు.

'నేను చెప్పేది ఎవరూ పట్టించుకోరు ఎందుకు?'

"నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నా(ఆర్థిక అంశంపై). అయినా వాళ్లు పట్టించుకోవడం లేదు. ఏం చేయాలనే దానిపై వారికే స్పష్టత లేదు. భారత్​ అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. కరోనాపైనే కాదు.. ఆర్థికపరంగా మనకు ఎదురయ్యే వినాశనాన్ని ఎదుర్కవడానికీ సిద్ధంగా ఉండాలి. దీని గురించి నేను పదే పదే చెప్తూనే ఉన్నా. కానీ నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. రానున్న 6 నెలల్లో మన ప్రజలు ఊహించని రీతిలో బాధను అనుభవించబోతున్నారు. ఈ విషయం చెప్పడానికి నేను ఎంతో బాధపడుతున్నా."

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

'తమిళ ప్రజలకు అవమానం...'

మంగళవారం లోక్​సభలో జీరో అవర్ సమయంలో ప్రాంతీయ భాషకు సంబంధించిన సమస్యలపై ఎంపీలు ప్రశ్నించడానికి ప్రయత్నించారు. అయితే స్పీకర్​ తమకు అనుమతినివ్వలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్​, డీఎంకే, ఎన్​సీపీ పార్టీలు దిగువ సభ నుంచి వాకౌట్​ చేశాయి.

ఈ వ్యవహారంపై రాహుల్​ గాంధీ స్పందించారు. ఎంపీలను ప్రశ్నలు అడగనివ్వకుండా అడ్డుకోవడం వల్ల తమిళ ప్రజలను అవమానించారని ఆరోపించారు. ఎంపీలను అడ్డుకున్నా.. తమిళనాడు ప్రజలకున్న హక్కులను హరింపజేయలేరని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- నిర్భయ అత్యాచారం రోజు ముఖేశ్​ దిల్లీలోనే లేడా?

కరోనా వైరస్​తో పాటు ఆర్థికపరంగా ఎదురయ్యే వినాశనాన్ని ఎదుర్కొనేందుకు భారతీయులు సిద్ధంగా ఉండాలని సూచించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. తాను ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫలితంగా రానున్న 6 నెలల పాటు ప్రజలు తీవ్ర కష్టాన్ని ఎదుర్కొంటారన్నారు.

'నేను చెప్పేది ఎవరూ పట్టించుకోరు ఎందుకు?'

"నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నా(ఆర్థిక అంశంపై). అయినా వాళ్లు పట్టించుకోవడం లేదు. ఏం చేయాలనే దానిపై వారికే స్పష్టత లేదు. భారత్​ అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. కరోనాపైనే కాదు.. ఆర్థికపరంగా మనకు ఎదురయ్యే వినాశనాన్ని ఎదుర్కవడానికీ సిద్ధంగా ఉండాలి. దీని గురించి నేను పదే పదే చెప్తూనే ఉన్నా. కానీ నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. రానున్న 6 నెలల్లో మన ప్రజలు ఊహించని రీతిలో బాధను అనుభవించబోతున్నారు. ఈ విషయం చెప్పడానికి నేను ఎంతో బాధపడుతున్నా."

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

'తమిళ ప్రజలకు అవమానం...'

మంగళవారం లోక్​సభలో జీరో అవర్ సమయంలో ప్రాంతీయ భాషకు సంబంధించిన సమస్యలపై ఎంపీలు ప్రశ్నించడానికి ప్రయత్నించారు. అయితే స్పీకర్​ తమకు అనుమతినివ్వలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్​, డీఎంకే, ఎన్​సీపీ పార్టీలు దిగువ సభ నుంచి వాకౌట్​ చేశాయి.

ఈ వ్యవహారంపై రాహుల్​ గాంధీ స్పందించారు. ఎంపీలను ప్రశ్నలు అడగనివ్వకుండా అడ్డుకోవడం వల్ల తమిళ ప్రజలను అవమానించారని ఆరోపించారు. ఎంపీలను అడ్డుకున్నా.. తమిళనాడు ప్రజలకున్న హక్కులను హరింపజేయలేరని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- నిర్భయ అత్యాచారం రోజు ముఖేశ్​ దిల్లీలోనే లేడా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.