ETV Bharat / bharat

గూగుల్​ బంపర్ ఆఫర్​: ఒకేసారి 12 మందితో వీడియో కాల్​

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు. దీని వల్ల ఇంట్లో ఉండి ఏం చేయాలో తోచని వారి కోసం టెక్‌ దిగ్గజం గూగుల్ ఓ బంపర్ ఆఫర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ డ్యుయో ద్వారా ఒకేసారి 12 మందితో వీడియో కాల్​ మాట్లాడే వెసులుబాటును కల్పించింది.

author img

By

Published : Mar 29, 2020, 2:56 PM IST

Google Duo increases group calling limit to 12 participants
గూగుల్​ బంపర్ ఆఫర్​: ఒకే సారి 12 మందితో వీడియో కాల్​

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. ఈ కారణంగా కోట్లాది మంది ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది. ఇలా ఇళ్లలోనే ఉంటున్న వారు వీడియో కాల్‌లో తమకు ఇష్టమైన వారితో మాట్లాడుతున్నారు. అయితే గ్రూప్‌ వీడియో కాల్‌లో మాట్లాడేందుకు పరిమిత సంఖ్యలో మాత్రమే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు టెక్‌ దిగ్గజం గూగుల్ సరికొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. గూగుల్‌ డ్యుయో చాట్​ యాప్​ ద్వారా ఒకేసారి 12 మందితో వీడియో కాల్​ మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. దీని ద్వారా సామాజిక దూరాన్నీ ప్రోత్సహించినట్లవుతుందని గూగుల్ భావిస్తోంది.

"గూగుల్‌ డ్యుయో వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా తమకు ఇష్టమైన వారిని చూసేందుకు మేం సహాయం చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో వీడియోకాలింగ్ ప్రాముఖ్యతను గుర్తించాం. అందుకే గ్రూప్‌ కాలింగ్ సభ్యుల పరిమితిని 8 నుంచి 12కు పెంచాం. నేటి నుంచే ఇది అందుబాటులో ఉంటుంది. ఇంకా ఎన్నో ఫీచర్లు వస్తూనే ఉంటాయి."

-సనాజ్​ అహారీ లెమెల్సన్​, గూగుల్​ ప్రొడక్ట్​ మెనేజ్​మెంట్​ సీనియర్​ డైరెక్టర్​

త్వరలో అందుబాటులోకి రానున్న ఫీచర్లకు సంబంధించిన వివారాలేవీ వెల్లడించలేదు సనాజ్​. 12 మంది ఒకేసారి మాట్లాడటానికి ఏర్పాటు చేసిన ఈ వెసులుబాటును భవిష్యత్తులో కొనసాగించాలా లేదా అనేది పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కరోనా టెస్ట్ కిట్​ కోసం ఓ అమ్మ పోరాటం

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. ఈ కారణంగా కోట్లాది మంది ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది. ఇలా ఇళ్లలోనే ఉంటున్న వారు వీడియో కాల్‌లో తమకు ఇష్టమైన వారితో మాట్లాడుతున్నారు. అయితే గ్రూప్‌ వీడియో కాల్‌లో మాట్లాడేందుకు పరిమిత సంఖ్యలో మాత్రమే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు టెక్‌ దిగ్గజం గూగుల్ సరికొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. గూగుల్‌ డ్యుయో చాట్​ యాప్​ ద్వారా ఒకేసారి 12 మందితో వీడియో కాల్​ మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. దీని ద్వారా సామాజిక దూరాన్నీ ప్రోత్సహించినట్లవుతుందని గూగుల్ భావిస్తోంది.

"గూగుల్‌ డ్యుయో వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా తమకు ఇష్టమైన వారిని చూసేందుకు మేం సహాయం చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో వీడియోకాలింగ్ ప్రాముఖ్యతను గుర్తించాం. అందుకే గ్రూప్‌ కాలింగ్ సభ్యుల పరిమితిని 8 నుంచి 12కు పెంచాం. నేటి నుంచే ఇది అందుబాటులో ఉంటుంది. ఇంకా ఎన్నో ఫీచర్లు వస్తూనే ఉంటాయి."

-సనాజ్​ అహారీ లెమెల్సన్​, గూగుల్​ ప్రొడక్ట్​ మెనేజ్​మెంట్​ సీనియర్​ డైరెక్టర్​

త్వరలో అందుబాటులోకి రానున్న ఫీచర్లకు సంబంధించిన వివారాలేవీ వెల్లడించలేదు సనాజ్​. 12 మంది ఒకేసారి మాట్లాడటానికి ఏర్పాటు చేసిన ఈ వెసులుబాటును భవిష్యత్తులో కొనసాగించాలా లేదా అనేది పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కరోనా టెస్ట్ కిట్​ కోసం ఓ అమ్మ పోరాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.