ETV Bharat / bharat

సరిహద్దులో గస్తీ కాస్తున్న త్రివిధ దళాలు 'హై అలర్ట్​'

author img

By

Published : Jun 17, 2020, 8:21 PM IST

సరిహద్దులో గస్తీ కాస్తున్న సైనిక, వైమానిక, నావికా దళ సిబ్బందికి హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. చైనాతో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హిందూ మహాసముద్రంతో పాటు సరిహద్దులోని ప్రముఖ బేస్​ క్యాంపులన్నింటికీ భారీగా బలగాలను మోహరించింది సైన్యం, నావికాదళం.

Army, Navy, Air Force raise alert level
సరిహద్దులో గస్తీ కాస్తున్న త్రివిధ దళాలు 'హై అలర్ట్​'

భారత్​-చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సరిహద్దులో హైఅలర్ట్​ ప్రకటించారు త్రివిధ దళాధిపతులు. చైనా నుంచి 3,500 కిలోమీటర్ల వాస్తవసరిహద్దులో గస్తీ కాస్తున్న వారందరూ అనుక్షణం అలర్ట్​గా ఉండాలని హెచ్చరించారు.

అరుణాచల్ ​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, హిమాచల్​ ప్రదేశ్​, లద్దాక్​లలోని అన్ని ప్రముఖ సరిహద్దు బేస్​ క్యాంపులకు ఇప్పటికే అదనపు బలగాలను మోహరించింది భారత సైన్యం. హిందూ మహా సముద్రంలోనూ బలగాలను పెద్ద ఎత్తున మోహరించింది భారత నావికాదళం.

ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​ అధ్యక్షులు, సీడీఎస్ జనరల్​ బిపిన్​ రావత్​తో కలిసి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ భేటీ అనంతరం సరిహద్దులో హైఅలర్ట్​ ప్రకటించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ​

తూర్పు లద్దాక్​లోని గాల్వన్​లోయలో చైనా-భారత్​ బలగాల మధ్య తలెత్తిన ఘర్షణ కారణంగా 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చైనా సైనికులు కూడా కొంతమంది చనిపోగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

'భారత్​ సిద్ధంగా ఉండాలి'

ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కునేందుకు భారత్​ సిద్ధంగా ఉండాలని సూచించారు భారత మాజీ సైన్యాధ్యక్షులు రాయ్​ చౌదరి. అయితే యుద్ధం వరకూ వెల్లకుండా.. చర్చలతోనే పరిస్థితిని చక్కదిద్దుకోవాలని సూచించారు.

" 1962లో భారత్​-చైనాలు యుద్ధం చేశాయి. భారత్ గానీ, చైనా గానీ​ 1962లో ఉన్నట్లుగా లేవు. ఇరుదేశాల శక్తి ప్రస్తుతం రెండింతలు పెరిగింది. అందుకే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధంగా ఉండాలి. అదే సమయంలో చర్చల ద్వారా పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించాలి. భారత్​ తమ భూభాగంలోనే ఓ వంతెన నిర్మాణం చేపట్టింది. కానీ చైనాకు అది నచ్చలేదు. అందుకే ఈ ఘర్షణ జరిగిందని అనుకుంటున్నా. ఇదంతా సైనికపరంగా మాత్రమే ఆలోచించి చెబుతున్నా.. తుది నిర్ణయం మాత్రం రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుంది."

- రాయ్​ చౌదరి, భారత మాజీ సైనికాధికారి

భారత్​-చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సరిహద్దులో హైఅలర్ట్​ ప్రకటించారు త్రివిధ దళాధిపతులు. చైనా నుంచి 3,500 కిలోమీటర్ల వాస్తవసరిహద్దులో గస్తీ కాస్తున్న వారందరూ అనుక్షణం అలర్ట్​గా ఉండాలని హెచ్చరించారు.

అరుణాచల్ ​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, హిమాచల్​ ప్రదేశ్​, లద్దాక్​లలోని అన్ని ప్రముఖ సరిహద్దు బేస్​ క్యాంపులకు ఇప్పటికే అదనపు బలగాలను మోహరించింది భారత సైన్యం. హిందూ మహా సముద్రంలోనూ బలగాలను పెద్ద ఎత్తున మోహరించింది భారత నావికాదళం.

ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​ అధ్యక్షులు, సీడీఎస్ జనరల్​ బిపిన్​ రావత్​తో కలిసి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ భేటీ అనంతరం సరిహద్దులో హైఅలర్ట్​ ప్రకటించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ​

తూర్పు లద్దాక్​లోని గాల్వన్​లోయలో చైనా-భారత్​ బలగాల మధ్య తలెత్తిన ఘర్షణ కారణంగా 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చైనా సైనికులు కూడా కొంతమంది చనిపోగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

'భారత్​ సిద్ధంగా ఉండాలి'

ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కునేందుకు భారత్​ సిద్ధంగా ఉండాలని సూచించారు భారత మాజీ సైన్యాధ్యక్షులు రాయ్​ చౌదరి. అయితే యుద్ధం వరకూ వెల్లకుండా.. చర్చలతోనే పరిస్థితిని చక్కదిద్దుకోవాలని సూచించారు.

" 1962లో భారత్​-చైనాలు యుద్ధం చేశాయి. భారత్ గానీ, చైనా గానీ​ 1962లో ఉన్నట్లుగా లేవు. ఇరుదేశాల శక్తి ప్రస్తుతం రెండింతలు పెరిగింది. అందుకే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధంగా ఉండాలి. అదే సమయంలో చర్చల ద్వారా పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించాలి. భారత్​ తమ భూభాగంలోనే ఓ వంతెన నిర్మాణం చేపట్టింది. కానీ చైనాకు అది నచ్చలేదు. అందుకే ఈ ఘర్షణ జరిగిందని అనుకుంటున్నా. ఇదంతా సైనికపరంగా మాత్రమే ఆలోచించి చెబుతున్నా.. తుది నిర్ణయం మాత్రం రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుంది."

- రాయ్​ చౌదరి, భారత మాజీ సైనికాధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.