కరోనాకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా దిల్లీలోని ప్రముఖ సర్ గంగారామ్ ఆసుపత్రిపై కేసు నమోదైంది. దిల్లీ వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుమారు 675 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని జూన్ 3న కొవిడ్ సేవలు అందించేందుకు దిల్లీ ప్రభుత్వం అనుమతించింది. అయితే, ఆసుపత్రి యాజమాన్యం ఉత్తర్వులను బేఖాతరు చేసిందంటూ ఇచ్చిన ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు కేసు నమోదు చేశారు.
ప్రముఖ ఆసుపత్రిపై ఎఫ్ఐఆర్.. కారణం!
కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు దేశ రాజధానిలోని ప్రముఖ సర్ గంగారామ్ ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దిల్లీ వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారి ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కరోనా పరీక్షలకు ఆర్టీ-పీసీఆర్ యాప్ను వినియోగించకపోవడమే కారణమని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దిల్లీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం శాంపిళ్లను సేకరించే ల్యాబ్స్ తప్పనిసరిగా ఈ యాప్ను వాడాల్సి ఉంది. సదరు ఆసుపత్రి ఆ యాప్ను వినియోగించకపోవడం వల్ల అంటు వ్యాధుల చట్టం 1897 కింద కొవిడ్ -19 నిబంధనలు పాటించని కారణంగా కేసు నమోదు చేశారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ యాప్ను తీసుకురాగా.. దిల్లీ ప్రభుత్వం యాప్ వినియోగాన్ని తప్పనిసరి చేసింది
కరోనాకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా దిల్లీలోని ప్రముఖ సర్ గంగారామ్ ఆసుపత్రిపై కేసు నమోదైంది. దిల్లీ వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుమారు 675 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని జూన్ 3న కొవిడ్ సేవలు అందించేందుకు దిల్లీ ప్రభుత్వం అనుమతించింది. అయితే, ఆసుపత్రి యాజమాన్యం ఉత్తర్వులను బేఖాతరు చేసిందంటూ ఇచ్చిన ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు కేసు నమోదు చేశారు.
కరోనా పరీక్షలకు ఆర్టీ-పీసీఆర్ యాప్ను వినియోగించకపోవడమే కారణమని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దిల్లీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం శాంపిళ్లను సేకరించే ల్యాబ్స్ తప్పనిసరిగా ఈ యాప్ను వాడాల్సి ఉంది. సదరు ఆసుపత్రి ఆ యాప్ను వినియోగించకపోవడం వల్ల అంటు వ్యాధుల చట్టం 1897 కింద కొవిడ్ -19 నిబంధనలు పాటించని కారణంగా కేసు నమోదు చేశారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ యాప్ను తీసుకురాగా.. దిల్లీ ప్రభుత్వం యాప్ వినియోగాన్ని తప్పనిసరి చేసింది