ETV Bharat / bharat

విదేశాల్లోని భారతీయులకు ఓటుహక్కు! - Postal Ballot latest news

విదేశాల్లోని భారతీయులకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఈమేరకు న్యాయశాఖకు లేఖ రాసింది.

EC proposes extending postal ballot facility for eligible overseas Indians
విదేశాల్లోని భారతీయులకు ఓటు హక్కు!
author img

By

Published : Dec 1, 2020, 7:06 PM IST

ఓటింగ్​ శాతాన్ని పెంచేందుకు, ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కసరత్తు ముమ్మరం చేసింది. విదేశాల్లోని అర్హత కలిగిన భారతీయులు ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్​ బ్యాలెట్​ సౌకర్యాన్ని విస్తరించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వశాఖ కార్యదర్శికి నవంబర్​ 27న లేఖ రాసింది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలు, బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్​ సౌకర్యాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల విశ్వాసం పెరిగిందని పేర్కొంది.

రానున్న అసోం, బంగాల్​, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ విధానం అమలు చేయడానికి కావాల్సిన సాంకేతిక, పరిపాలనపరమైన సదుపాయాలను సిద్ధం చేసుకున్నట్లు లేఖలో వెల్లడించింది ఈసీ. వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్​ నెలల్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

వృద్ధులు, విదేశాల్లోని అర్హత ఉన్న భారతీయులు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారని తెలిపింది ఎన్నికల సంఘం. వారూ ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్​ బ్యాలెట్​ను విస్తరించాలనే ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో... ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.

ఈసీ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే విదేశాల్లోని భారతీయులు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

ఇదీ చూడండి: 'డబ్ల్యూటీఓ వల్లే సాగు చట్టాలు- ఇలా అయితే కష్టమే'

ఓటింగ్​ శాతాన్ని పెంచేందుకు, ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కసరత్తు ముమ్మరం చేసింది. విదేశాల్లోని అర్హత కలిగిన భారతీయులు ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్​ బ్యాలెట్​ సౌకర్యాన్ని విస్తరించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వశాఖ కార్యదర్శికి నవంబర్​ 27న లేఖ రాసింది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలు, బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్​ సౌకర్యాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల విశ్వాసం పెరిగిందని పేర్కొంది.

రానున్న అసోం, బంగాల్​, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ విధానం అమలు చేయడానికి కావాల్సిన సాంకేతిక, పరిపాలనపరమైన సదుపాయాలను సిద్ధం చేసుకున్నట్లు లేఖలో వెల్లడించింది ఈసీ. వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్​ నెలల్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

వృద్ధులు, విదేశాల్లోని అర్హత ఉన్న భారతీయులు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారని తెలిపింది ఎన్నికల సంఘం. వారూ ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్​ బ్యాలెట్​ను విస్తరించాలనే ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో... ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.

ఈసీ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే విదేశాల్లోని భారతీయులు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

ఇదీ చూడండి: 'డబ్ల్యూటీఓ వల్లే సాగు చట్టాలు- ఇలా అయితే కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.