ETV Bharat / bharat

ఏడు రోజుల శిశువులో కరోనా 'యాంటీబాడీలు' - antibodies in 7 day child

దేశంలో తొలిసారిగా చిన్న పిల్లల్లో వచ్చే మల్టీసిస్టమ్ ఇన్​ఫ్లమేటరీ సిండ్రోమ్​ వ్యాధి.. సూరత్​లో 7 రోజుల చిన్నారిలో కనిపించింది. గర్భంతో ఉన్న సమయంలో తల్లి నుంచి కరోనా యాంటీబాడీలు శిశువు శరీరంలో ప్రవేశించటమే ఇందుకు కారణమని వైద్యులు తెలిపారు. యాంటీబాడీల కారణంగా చిన్నారి మెదడు, గుండె, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని వెల్లడించారు.

mis c in india
చిన్నారి
author img

By

Published : Oct 2, 2020, 6:16 AM IST

చిన్న పిల్లల్లో మల్టీసిస్టమ్​ ఇన్​ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్​-సీ)​.. ఇతర దేశాల్లో తరచుగా వచ్చే వ్యాధి. కానీ, గుజరాత్​ సూరత్ నగరంలో 7 రోజుల శిశువులో గుర్తించారు వైద్యులు. ఇంత చిన్న వయసు చిన్నారుల్లో ఎంఐఎస్ కనిపించటం ప్రపంచంలో ఇదే తొలిసారి అని పేర్కొంటున్నారు.

భండేరిలోని ఓ కుటుంబంలో ఆడబిడ్డ జన్మించింది. శిశువుకు 3 రోజుల తర్వాత జ్వరం రాగా.. ఆసుపత్రిలో చేర్పించారు. 3 రోజులు గడిచిన తర్వాత కూడా జ్వరం తగ్గకపోవటం వల్ల కరోనా పరీక్ష చేశారు. ఇందులో పాజిటివ్​ ఉన్నట్లు తేలింది.

సందేహంతో యాంటీబాడీ టెస్టులు..

అనంతరం ఆమె తల్లికి కరోనా పరీక్షలు చేయగా నెగటివ్​ అని వచ్చింది. మరోవైపు చిన్నారి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. ఏ సమయంలోనైనా గుండెపై ప్రభావం పడే సూచనలు కనిపించటం వల్ల శిశువుకు ఎంఐఎస్​-సీ ఉందేమోనని అనుమానించారు వైద్యులు.

ఫలితంగా తల్లీబిడ్డలకు కరోనా యాంటీబాడీ టెస్టులను నిర్వహించగా.. ఇద్దరిలోనూ ప్రతిరోధకాలు ఉన్నట్లు గుర్తించారు. గర్భిణిగా ఉన్నప్పుడే ఆమెకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరణకు వచ్చారు. కానీ, ఆ సమయంలో ఎవరూ గమనించకపోవచ్చని తెలిపారు. కరోనా తగ్గిన తర్వాత ఆమె నుంచి గర్భంలోని శిశువుకు యాంటీబాడీలు చేరి ఉంటాయని భావిస్తున్నారు.

చికిత్స లేదు..

చిన్నారి శరీరంలోకి యాంటీబాడీలు ప్రవేశించటం వల్ల మెదడు, హృదయం, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని నైన్స్​ పిల్లల ఆసుపత్రి వైద్యులు అశోఖ్ గోతి స్పష్టం చేశారు. ఈ విషయమై అమెరికా, జర్మనీ వైద్యులతో సంప్రదించామని, అయితే ఇంత చిన్న వయసులో ఈ వ్యాధి ఎవరికీ రాలేదని చెప్పినట్లు వివరించారు. దీనికి ఎలాంటి చికిత్స లేదని తెలిపారు.

అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా చిన్నారికి అశోక్ చికిత్స అందించారు. 15 రోజుల తర్వాత చిన్నారి కోలుకుంది.

mis c in india
ఎంఐఎస్​ సీ నుంచి కోలుకున్న చిన్నారి

ఇదీ చూడండి: ఎడారి రాష్ట్రంలో 'కుంకుమ' సిరులు

చిన్న పిల్లల్లో మల్టీసిస్టమ్​ ఇన్​ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్​-సీ)​.. ఇతర దేశాల్లో తరచుగా వచ్చే వ్యాధి. కానీ, గుజరాత్​ సూరత్ నగరంలో 7 రోజుల శిశువులో గుర్తించారు వైద్యులు. ఇంత చిన్న వయసు చిన్నారుల్లో ఎంఐఎస్ కనిపించటం ప్రపంచంలో ఇదే తొలిసారి అని పేర్కొంటున్నారు.

భండేరిలోని ఓ కుటుంబంలో ఆడబిడ్డ జన్మించింది. శిశువుకు 3 రోజుల తర్వాత జ్వరం రాగా.. ఆసుపత్రిలో చేర్పించారు. 3 రోజులు గడిచిన తర్వాత కూడా జ్వరం తగ్గకపోవటం వల్ల కరోనా పరీక్ష చేశారు. ఇందులో పాజిటివ్​ ఉన్నట్లు తేలింది.

సందేహంతో యాంటీబాడీ టెస్టులు..

అనంతరం ఆమె తల్లికి కరోనా పరీక్షలు చేయగా నెగటివ్​ అని వచ్చింది. మరోవైపు చిన్నారి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. ఏ సమయంలోనైనా గుండెపై ప్రభావం పడే సూచనలు కనిపించటం వల్ల శిశువుకు ఎంఐఎస్​-సీ ఉందేమోనని అనుమానించారు వైద్యులు.

ఫలితంగా తల్లీబిడ్డలకు కరోనా యాంటీబాడీ టెస్టులను నిర్వహించగా.. ఇద్దరిలోనూ ప్రతిరోధకాలు ఉన్నట్లు గుర్తించారు. గర్భిణిగా ఉన్నప్పుడే ఆమెకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరణకు వచ్చారు. కానీ, ఆ సమయంలో ఎవరూ గమనించకపోవచ్చని తెలిపారు. కరోనా తగ్గిన తర్వాత ఆమె నుంచి గర్భంలోని శిశువుకు యాంటీబాడీలు చేరి ఉంటాయని భావిస్తున్నారు.

చికిత్స లేదు..

చిన్నారి శరీరంలోకి యాంటీబాడీలు ప్రవేశించటం వల్ల మెదడు, హృదయం, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని నైన్స్​ పిల్లల ఆసుపత్రి వైద్యులు అశోఖ్ గోతి స్పష్టం చేశారు. ఈ విషయమై అమెరికా, జర్మనీ వైద్యులతో సంప్రదించామని, అయితే ఇంత చిన్న వయసులో ఈ వ్యాధి ఎవరికీ రాలేదని చెప్పినట్లు వివరించారు. దీనికి ఎలాంటి చికిత్స లేదని తెలిపారు.

అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా చిన్నారికి అశోక్ చికిత్స అందించారు. 15 రోజుల తర్వాత చిన్నారి కోలుకుంది.

mis c in india
ఎంఐఎస్​ సీ నుంచి కోలుకున్న చిన్నారి

ఇదీ చూడండి: ఎడారి రాష్ట్రంలో 'కుంకుమ' సిరులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.