ETV Bharat / bharat

పెను తుపానుగా మారనున్న 'ఫొని'

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను 'ఫొని'.. తీవ్ర తుపానుగా రూపాంతరం చెందింది. బుధవారం నాటికి ఇది పెను తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ దళం, కోస్ట్‌గార్డులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

author img

By

Published : Apr 30, 2019, 7:01 AM IST

Updated : Apr 30, 2019, 8:49 AM IST

మహా తుపానుగా మారనున్న 'ఫొని'
పెను తుపానుగా మారనున్న 'ఫొని'

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుపాను స్థిరంగా కొనసాగుతోంది. గంటకు 16 కి.మీ వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

మే 1 వరకు వాయవ్య దిశగా పయనించనున్న ఫొని తుపాను.. క్రమంగా ఈశాన్యం వైపు మళ్లి ఒడిశా తీరానికి చేరే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను సమయంలో గంటకు 80-90 కి.మీ వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది.

పెను తుపానుగా మారితే గంటకు 170-180 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. గురువారం నుంచి ఒడిశా తీర ప్రాంతాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ.

'ఫొని’ తుపాను నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశాతో పాటు కోస్తాంధ్రకు చెందిన ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలను భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇప్పటికే అప్రమత్తం చేసింది. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే వెళ్లినవారు తిరిగి రావాలని హెచ్చరికలు జారీ చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుపాను పట్ల అప్రమత్తమయ్యాయి. జాతీయ విపత్తు నిర్వహణ దళం, కోస్ట్‌గార్డులను ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించాయి. తుపాను సన్నద్ధతపై కేంద్ర కేబినెట్​ కార్యదర్శి రాష్ట్రాల విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.

పెను తుపానుగా మారనున్న 'ఫొని'

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుపాను స్థిరంగా కొనసాగుతోంది. గంటకు 16 కి.మీ వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

మే 1 వరకు వాయవ్య దిశగా పయనించనున్న ఫొని తుపాను.. క్రమంగా ఈశాన్యం వైపు మళ్లి ఒడిశా తీరానికి చేరే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను సమయంలో గంటకు 80-90 కి.మీ వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది.

పెను తుపానుగా మారితే గంటకు 170-180 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. గురువారం నుంచి ఒడిశా తీర ప్రాంతాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ.

'ఫొని’ తుపాను నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశాతో పాటు కోస్తాంధ్రకు చెందిన ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలను భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇప్పటికే అప్రమత్తం చేసింది. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే వెళ్లినవారు తిరిగి రావాలని హెచ్చరికలు జారీ చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుపాను పట్ల అప్రమత్తమయ్యాయి. జాతీయ విపత్తు నిర్వహణ దళం, కోస్ట్‌గార్డులను ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించాయి. తుపాను సన్నద్ధతపై కేంద్ర కేబినెట్​ కార్యదర్శి రాష్ట్రాల విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.

New Delhi, Apr 29 (ANI): Deputy Election Commissioner Sandeep Saxena after conclusion of voting for fourth phase of general elections announced that total electorate crossed 91 crore mark. "Complete number of electorate going for polls have finally reached 91, 01, 36, 588 excluding service voters", said. Voting for 71 seats in 9 states in the fourth phase concluded today. The 17th Lok Sabha election results will be declared on May 23.
Last Updated : Apr 30, 2019, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.