ETV Bharat / bharat

'తుపాకులు' ఎత్తే సైనికులు 'రంపాలు'​ పట్టారు!

author img

By

Published : May 24, 2020, 6:52 PM IST

Updated : May 24, 2020, 8:40 PM IST

సైనిక, జాతీయ విపత్తు స్పందన దళాలు(ఎన్​డీఆర్​ఎఫ్​) అంపన్​ తుపాను సహాయక చర్యలు ప్రారంభించాయి. అటవీ శాఖ, పౌర సంస్థలకు అండగా రంగంలోకి దిగాయి. తుపాను వల్ల అంధకారంలో ఉన్న ప్రాంతాల్లో విద్యుత్​, రవాణా, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Cyclone Amphan: Army lends their hand to clear out uprooted trees
'తుపాకులు' ఎత్తే సైనికులు.. ప్రజల కోసం 'రంపాలు'​ పట్టారు!

సరిహద్దులో తుపాకులు పట్టి గస్తీ కాసే సైనికులు... ప్రజల కోసం అహోరాత్రులు శ్రమిస్తారు. మరి జనాలు కష్టం వచ్చింది రక్షించండి అంటే చూస్తూ ఉంటారా? అందుకే మేమున్నాం అంటూ రంగంలోకి దిగారు. గన్​లు పట్టిన చేతులతోనే చెట్లు నరికేందుకు రంపాలు పట్టారు. తుపాను గాయాలను తుడిపేందుకు ముందుండి సేవలందిస్తున్నారు.

రాత్రీపగలు తేడాలేకుండా..

జాతీయ విపత్తు స్పందన దళాలు(ఎన్​డీఆర్​ఎఫ్​), సైనిక బృందాలు బంగాల్​లో అంపన్​ తుపాను సహాయక చర్యలు ప్రారంభించాయి. తుపాను వల్ల దెబ్బతిన్న మౌలిక సౌకర్యాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్న అటవీ శాఖ, పౌర సంస్థలకు అండగా నిలిచాయి.

ఉప్పునీటి సరస్సు, బెహాలా, గోల్​ పార్క్​ ప్రాంతాల్లో రోడ్లమీద పడిన భారీ వృక్షాలను తొలగించడానికి.. ఆర్మీ, ఎన్​డీఆర్​ఎఫ్​ బలగాలు ఆదివారం ఉదయమే రంగంలోకి దిగాయి. దక్షిణ కోల్​కతాలోని పలు ప్రాంతాల్లో యంత్రాలతో చెట్లను నరికి... విద్యుత్, రవాణా, సౌకర్యాలను పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రారంభించాయి. వారంతా రాత్రీపగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు. కోల్​కతా మున్సిపల్​ కార్పొరేషన్ సిబ్బంది సైతం వారితో పాటు సేవలందిస్తున్నారు.

'తుపాకులు' ఎత్తే సైనికులు 'రంపాలు'​ పట్టారు!

మొబైల్​, ఇంటర్నెట్​ సేవలు..

విద్యుత్​, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు బుధవారం మధ్యాహ్నం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు అధికారులు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్,​ మొబైల్​ సేవలు పునరుద్ధరించినట్లు తెలిపారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కొన్ని గ్రామాలు ఇప్పటికీ అంధకారంలోనే ఉన్నాయని చెప్పారు.

Cyclone Amphan: Army lends their hand to clear out uprooted trees
'తుపాకులు' ఎత్తే సైనికులు.. ప్రజల కోసం 'రంపాలు'​ పట్టారు!
Cyclone Amphan: Army lends their hand to clear out uprooted trees
కొమ్మలను లాగుతున్న జవాను
Cyclone Amphan: Army lends their hand to clear out uprooted trees
అడ్డుగా చెట్లను తొలగిస్తున్న సైనికులు

భారీ నష్టం

తుపాను వల్ల రూ.1 లక్ష కోట్లు నష్టం వాటిల్లినట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఆరు కోట్ల ప్రజల మీద తుపాను ప్రభావం చూపిందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: వీడిన మిస్టరీ: మహారాష్ట్రలో మర్డర్​- తెలంగాణలో అరెస్ట్​

సరిహద్దులో తుపాకులు పట్టి గస్తీ కాసే సైనికులు... ప్రజల కోసం అహోరాత్రులు శ్రమిస్తారు. మరి జనాలు కష్టం వచ్చింది రక్షించండి అంటే చూస్తూ ఉంటారా? అందుకే మేమున్నాం అంటూ రంగంలోకి దిగారు. గన్​లు పట్టిన చేతులతోనే చెట్లు నరికేందుకు రంపాలు పట్టారు. తుపాను గాయాలను తుడిపేందుకు ముందుండి సేవలందిస్తున్నారు.

రాత్రీపగలు తేడాలేకుండా..

జాతీయ విపత్తు స్పందన దళాలు(ఎన్​డీఆర్​ఎఫ్​), సైనిక బృందాలు బంగాల్​లో అంపన్​ తుపాను సహాయక చర్యలు ప్రారంభించాయి. తుపాను వల్ల దెబ్బతిన్న మౌలిక సౌకర్యాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్న అటవీ శాఖ, పౌర సంస్థలకు అండగా నిలిచాయి.

ఉప్పునీటి సరస్సు, బెహాలా, గోల్​ పార్క్​ ప్రాంతాల్లో రోడ్లమీద పడిన భారీ వృక్షాలను తొలగించడానికి.. ఆర్మీ, ఎన్​డీఆర్​ఎఫ్​ బలగాలు ఆదివారం ఉదయమే రంగంలోకి దిగాయి. దక్షిణ కోల్​కతాలోని పలు ప్రాంతాల్లో యంత్రాలతో చెట్లను నరికి... విద్యుత్, రవాణా, సౌకర్యాలను పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రారంభించాయి. వారంతా రాత్రీపగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు. కోల్​కతా మున్సిపల్​ కార్పొరేషన్ సిబ్బంది సైతం వారితో పాటు సేవలందిస్తున్నారు.

'తుపాకులు' ఎత్తే సైనికులు 'రంపాలు'​ పట్టారు!

మొబైల్​, ఇంటర్నెట్​ సేవలు..

విద్యుత్​, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు బుధవారం మధ్యాహ్నం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు అధికారులు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్,​ మొబైల్​ సేవలు పునరుద్ధరించినట్లు తెలిపారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కొన్ని గ్రామాలు ఇప్పటికీ అంధకారంలోనే ఉన్నాయని చెప్పారు.

Cyclone Amphan: Army lends their hand to clear out uprooted trees
'తుపాకులు' ఎత్తే సైనికులు.. ప్రజల కోసం 'రంపాలు'​ పట్టారు!
Cyclone Amphan: Army lends their hand to clear out uprooted trees
కొమ్మలను లాగుతున్న జవాను
Cyclone Amphan: Army lends their hand to clear out uprooted trees
అడ్డుగా చెట్లను తొలగిస్తున్న సైనికులు

భారీ నష్టం

తుపాను వల్ల రూ.1 లక్ష కోట్లు నష్టం వాటిల్లినట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఆరు కోట్ల ప్రజల మీద తుపాను ప్రభావం చూపిందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: వీడిన మిస్టరీ: మహారాష్ట్రలో మర్డర్​- తెలంగాణలో అరెస్ట్​

Last Updated : May 24, 2020, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.