ETV Bharat / bharat

దేశంలో ఆగని కరోనా అలజడి-మరిన్నిపెరిగిన కేసులు - Coronavirus latest news in india

దిల్లీలో జమాత్‌ ప్రార్థనలకు హాజరైన వారి ద్వారా వైరస్ విస్తరణతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు అన్నిరాష్ట్రాల్లో కలిపి బాధితుల సంఖ్య 1,965కు చేరింది. మొత్తం మృతులు 50కి చేరగా.. వివిధ ఆస్పత్రుల నుంచి 151 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

COVID-19 death toll touches 50, total number of positive cases rise to 1,965 in country
దేశంలో ఆగని కరోనా అలజడి-మరిన్నిపెరిగిన కేసులు
author img

By

Published : Apr 2, 2020, 6:18 PM IST

దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. దిల్లీలో నిజాముద్దీన్ జమాత్‌ ప్రార్థనలకు హాజరైన వారిలో చాలా మంది వైరస్‌ బారిన పడినట్లు గుర్తించారు అధికారులు. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,965 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,764 యాక్టివ్​ కేసులుండగా, 151 మంది కోలుకున్నారు. మరో 50 మంది మృత్యువాతపడ్డారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 13 మంది చనిపోగా.. గుజరాత్​-6, మధ్యప్రదేశ్​-6, పంజాబ్​-4, కర్ణాటక-3, తెలంగాణ-3, బంగాల్​-3, దిల్లీ, జమ్ముకశ్మీర్, ఉత్తర్​ప్రదేశ్​, కేరళలో రెండేసి మరణాలు, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, బిహార్​, హిమాచల్​ ప్రదేశ్​లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో అత్యధికంగా 335 కేసులు నమోదవ్వగా.. 265 కేసులతో కేరళ రెండోస్థానం, 234 కేసులతో తమిళనాడు మూడోస్థానంలో ఉన్నాయి.

గుజరాత్​లో 7కు చేరిన మృతులు

గుజరాత్​ వడోదరాలో 52 ఏళ్ల వ్యక్తి ఇవాళ ఉదయం కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. ఫలితంగా గుజరాత్​ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 7కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 87 కేసులు నమోదయ్యాయి.

మధ్యప్రదేశ్​లో 8

మధ్యప్రదేశ్​లోనూ కరోనాతో ఇవాళ 54 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 8కి చేరింది. మధ్యప్రదేశ్​లో ఇప్పటివరకు మొత్తం 75 కేసులు నమోదయ్యాయి.

దిల్లీ ఎయిమ్స్​ డాక్టర్​కు కరోనా?

దిల్లీలోని ఎయిమ్స్​ డాక్టర్​కు కరోనా పాజిటివ్​గా వచ్చినట్లు సమాచారం. ఫిజియాలజీ విభాగానికి చెందిన వైద్యుడిని ప్రస్తుతం ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.

లాక్​డౌన్​ అతిక్రమిస్తే ఉపేక్షించకండి

లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే విపత్తు యాజమాన్య చట్టం, ఇండియన్​ పీనల్ కోడ్​ (ఐపీసీ) ప్రకారం చట్టబద్ధమైన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఏ చర్య తీసుకోవాలో సవివరమైన నిబంధనల జాబితాను రాష్ట్రాలకు పంపారు.

9 వేల మంది నిర్బంధం

దేశవ్యాప్తంగా 9వేల మంది తబ్లీగి జమాత్​ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని, వారితో కలిసి మెలిగిన వారిని క్వారంటైన్​లో ఉంచినట్లు కేంద్ర హోంశాఖ సీనియర్​ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

కరోనా హాట్​స్పాట్​లు

కరోనా హాట్ స్పాట్లలో రాపిడ్ యాంటీ బాడీటెస్ట్​లు నిర్వహించాలని వైద్య పరిశోధన మండలి నిర్ణయించింది. హాట్ స్పాట్​లుగా పరిగణించిన ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉన్న చోట ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. గొంతు, ముక్కు రంధ్రాల వద్ద ఈ పరీక్షలు చేసి.. పాజిటివ్​గా వస్తే సదరు వ్యక్తిని చికిత్సకు పంపాల్సి ఉంటుంది. నెగటివ్ వచ్చిన వారు ఇంటికే పరిమితం కావాలని మధ్యంతర సూచనలు జారీ చేసింది వైద్య పరిశోధన మండలి.

దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. దిల్లీలో నిజాముద్దీన్ జమాత్‌ ప్రార్థనలకు హాజరైన వారిలో చాలా మంది వైరస్‌ బారిన పడినట్లు గుర్తించారు అధికారులు. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,965 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,764 యాక్టివ్​ కేసులుండగా, 151 మంది కోలుకున్నారు. మరో 50 మంది మృత్యువాతపడ్డారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 13 మంది చనిపోగా.. గుజరాత్​-6, మధ్యప్రదేశ్​-6, పంజాబ్​-4, కర్ణాటక-3, తెలంగాణ-3, బంగాల్​-3, దిల్లీ, జమ్ముకశ్మీర్, ఉత్తర్​ప్రదేశ్​, కేరళలో రెండేసి మరణాలు, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, బిహార్​, హిమాచల్​ ప్రదేశ్​లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో అత్యధికంగా 335 కేసులు నమోదవ్వగా.. 265 కేసులతో కేరళ రెండోస్థానం, 234 కేసులతో తమిళనాడు మూడోస్థానంలో ఉన్నాయి.

గుజరాత్​లో 7కు చేరిన మృతులు

గుజరాత్​ వడోదరాలో 52 ఏళ్ల వ్యక్తి ఇవాళ ఉదయం కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. ఫలితంగా గుజరాత్​ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 7కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 87 కేసులు నమోదయ్యాయి.

మధ్యప్రదేశ్​లో 8

మధ్యప్రదేశ్​లోనూ కరోనాతో ఇవాళ 54 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 8కి చేరింది. మధ్యప్రదేశ్​లో ఇప్పటివరకు మొత్తం 75 కేసులు నమోదయ్యాయి.

దిల్లీ ఎయిమ్స్​ డాక్టర్​కు కరోనా?

దిల్లీలోని ఎయిమ్స్​ డాక్టర్​కు కరోనా పాజిటివ్​గా వచ్చినట్లు సమాచారం. ఫిజియాలజీ విభాగానికి చెందిన వైద్యుడిని ప్రస్తుతం ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.

లాక్​డౌన్​ అతిక్రమిస్తే ఉపేక్షించకండి

లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే విపత్తు యాజమాన్య చట్టం, ఇండియన్​ పీనల్ కోడ్​ (ఐపీసీ) ప్రకారం చట్టబద్ధమైన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఏ చర్య తీసుకోవాలో సవివరమైన నిబంధనల జాబితాను రాష్ట్రాలకు పంపారు.

9 వేల మంది నిర్బంధం

దేశవ్యాప్తంగా 9వేల మంది తబ్లీగి జమాత్​ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని, వారితో కలిసి మెలిగిన వారిని క్వారంటైన్​లో ఉంచినట్లు కేంద్ర హోంశాఖ సీనియర్​ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

కరోనా హాట్​స్పాట్​లు

కరోనా హాట్ స్పాట్లలో రాపిడ్ యాంటీ బాడీటెస్ట్​లు నిర్వహించాలని వైద్య పరిశోధన మండలి నిర్ణయించింది. హాట్ స్పాట్​లుగా పరిగణించిన ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉన్న చోట ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. గొంతు, ముక్కు రంధ్రాల వద్ద ఈ పరీక్షలు చేసి.. పాజిటివ్​గా వస్తే సదరు వ్యక్తిని చికిత్సకు పంపాల్సి ఉంటుంది. నెగటివ్ వచ్చిన వారు ఇంటికే పరిమితం కావాలని మధ్యంతర సూచనలు జారీ చేసింది వైద్య పరిశోధన మండలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.