ETV Bharat / bharat

దేశంలో కరోనా ప్రభావంపై కేంద్రమంత్రుల బృందం సమీక్ష - కరోనాతో దేశ పరిస్థితులపై కేంద్రమంత్రుల బృందం సమీక్ష

రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం... కరోనా నియంత్రణ చర్యలు, వైద్య వ్యవస్థ సన్నద్ధతపై సమగ్ర సమీక్ష నిర్వహించింది. అలాగే 21 రోజుల లాక్​డౌన్​ వల్ల తలెత్తే సమస్యలనూ సమీక్షించింది.

GoM reviews overall situation across India
కరోనాతో దేశ పరిస్థితులపై కేంద్రమంత్రుల బృందం సమీక్ష
author img

By

Published : Apr 3, 2020, 4:02 PM IST

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో, మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహించింది. అలాగే 21 రోజుల లాక్​డౌన్​ వల్ల తలెత్తే పరిస్థితులపైనా సమీక్ష చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు.

రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఈ సమీక్ష నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి రాంవిలాస్ పాసవాన్​, సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ సహా పలువురు మంత్రులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

కరోనా కట్టడికి

కరోనా కేసుల నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలతోపాటు, లాక్​డౌన్​ సమయంలో సరిపడా ఔషధాలు, నిత్యావసర వస్తువుల సరఫరా ఏర్పాట్లు గురించి మంత్రులు చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సాయుధ దళాల ఆసుపత్రుల్లో పరీక్షలు

కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సాయుధ దళాల ఆసుపత్రుల్లో ఐదు వైరల్ టెస్టింగ్ ల్యాబ్​లను ఏర్పాటు చేసినట్లు రక్షణమంత్రిత్వ శాఖ తెలిపింది.

దిల్లీలోని ఆర్మీ హాస్పిటల్​ (రీసెర్చ్ అండ్ రెఫరల్​), బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ కమాండ్​ ఆసుపత్రి, పుణెలోని ఆర్మ్​డ్​ ఫోర్సెస్​ మెడికల్​ కాలేజీ, లఖ్​నవూలోని కమాండ్ హాస్పిటల్​, ఉదంపుర్​లోని కమాండ్ ఆసుపత్రిలో వైరల్ టెస్టింగ్ ల్యాబ్​లను ఏర్పాటుచేశారు.

వీటితో పాటు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు మరో ఆరు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా మరో 51 ఆసుపత్రులను సిద్ధం చేశారు. వీటిలో హై డిపెండెన్సీ యూనిట్లు, ఇంటెన్సివ్​ కేర్ పడకలు సిద్ధంగా ఉంచారు.

క్వారంటైన్​

ప్రస్తుతం ముంబయి, జైసల్మీర్, జోధ్​పుర్​, హిందన్, మనేసర్​, చెన్నైల్లోని సాయుధ దళాల ఆసుపత్రుల్లో క్వారంటైన్ సదుపాయాలున్నాయి. ఈ నిర్బంధ కేంద్రాల్లో మొత్తం 1,737 మందికి పరీక్షలు, చికిత్స అందించగా, ఇప్పటి వరకు 403 మంది సురక్షితంగా బయటపడ్డారు.

పొరుగు దేశాలకు సాయం

భారత్​ తన పొరుగు దేశాలకు సాయం అందించేందుకు ఆరు నావికాదళ నౌకలను సిద్ధంగా ఉంచింది. మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, అఫ్గానిస్థాన్​లకు సాయం అందించడానికి ఐదు వైద్య బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

ప్రపంచం విలవిల

భారత్​లో ఇప్పటి వరకు 2,301 కరోనా కేసులు నమోదవగా.. 56 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఒక మిలియన్ మందికిపైగా ప్రజలు కరోనా బారిన పడగా, 54 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ వేళ పెరిగిన గృహ హింస కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో, మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహించింది. అలాగే 21 రోజుల లాక్​డౌన్​ వల్ల తలెత్తే పరిస్థితులపైనా సమీక్ష చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు.

రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఈ సమీక్ష నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి రాంవిలాస్ పాసవాన్​, సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ సహా పలువురు మంత్రులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

కరోనా కట్టడికి

కరోనా కేసుల నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలతోపాటు, లాక్​డౌన్​ సమయంలో సరిపడా ఔషధాలు, నిత్యావసర వస్తువుల సరఫరా ఏర్పాట్లు గురించి మంత్రులు చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సాయుధ దళాల ఆసుపత్రుల్లో పరీక్షలు

కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సాయుధ దళాల ఆసుపత్రుల్లో ఐదు వైరల్ టెస్టింగ్ ల్యాబ్​లను ఏర్పాటు చేసినట్లు రక్షణమంత్రిత్వ శాఖ తెలిపింది.

దిల్లీలోని ఆర్మీ హాస్పిటల్​ (రీసెర్చ్ అండ్ రెఫరల్​), బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ కమాండ్​ ఆసుపత్రి, పుణెలోని ఆర్మ్​డ్​ ఫోర్సెస్​ మెడికల్​ కాలేజీ, లఖ్​నవూలోని కమాండ్ హాస్పిటల్​, ఉదంపుర్​లోని కమాండ్ ఆసుపత్రిలో వైరల్ టెస్టింగ్ ల్యాబ్​లను ఏర్పాటుచేశారు.

వీటితో పాటు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు మరో ఆరు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా మరో 51 ఆసుపత్రులను సిద్ధం చేశారు. వీటిలో హై డిపెండెన్సీ యూనిట్లు, ఇంటెన్సివ్​ కేర్ పడకలు సిద్ధంగా ఉంచారు.

క్వారంటైన్​

ప్రస్తుతం ముంబయి, జైసల్మీర్, జోధ్​పుర్​, హిందన్, మనేసర్​, చెన్నైల్లోని సాయుధ దళాల ఆసుపత్రుల్లో క్వారంటైన్ సదుపాయాలున్నాయి. ఈ నిర్బంధ కేంద్రాల్లో మొత్తం 1,737 మందికి పరీక్షలు, చికిత్స అందించగా, ఇప్పటి వరకు 403 మంది సురక్షితంగా బయటపడ్డారు.

పొరుగు దేశాలకు సాయం

భారత్​ తన పొరుగు దేశాలకు సాయం అందించేందుకు ఆరు నావికాదళ నౌకలను సిద్ధంగా ఉంచింది. మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, అఫ్గానిస్థాన్​లకు సాయం అందించడానికి ఐదు వైద్య బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

ప్రపంచం విలవిల

భారత్​లో ఇప్పటి వరకు 2,301 కరోనా కేసులు నమోదవగా.. 56 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఒక మిలియన్ మందికిపైగా ప్రజలు కరోనా బారిన పడగా, 54 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ వేళ పెరిగిన గృహ హింస కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.