ETV Bharat / bharat

'మహా'లో కరోనా రికార్డు.. ఒక్కరోజే 6వేలమందికి వైరస్

author img

By

Published : Jul 3, 2020, 9:07 PM IST

Updated : Jul 3, 2020, 10:12 PM IST

మహారాష్ట్రలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 6,364మందికి వైరస్ నిర్ధరణ అయింది. 198 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, దిల్లీ, మధ్యప్రదేశ్​, బంగాల్​లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది.

corona cases in india
'మహా'లో కరోనా రికార్డు.. ఒక్కరోజులో 6వేలమందికి వైరస్

మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 6,364 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 198మంది కొత్తగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 1,92,990 మంది వైరస్ బారినపడ్డారు. మృతుల సంఖ్య 8376కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 79, 927గా ఉంది. అయితే తాజాగా 3,515మంది వైరస్ నయమై ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. మొత్తంగా 1,04,687 మందికి వైరస్ నయమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,49,227 వైరస్ పరీక్షలు నిర్వహించారు.

తమిళనాడులో కొత్తగా 4వేలమందికి..

తమిళనాడులో కరోనా విలయం సృష్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,329 కేసులు నిర్ధరణ అయినట్లు తమిళనాడు వైద్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,02,721కి చేరింది. కొత్త కేసుల్లో 2,082 మంది బాధితులను చెన్నైలోనే గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

కర్ణాటకలో ఒక్కరోజులో 1,694 మందికి..

రాష్ట్రంలో కొత్తగా 1,694 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో అక్కడ వైరస్ బాధితుల సంఖ్య 17,710కి పెరిగింది. ఒక్కరోజులో 21మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మరణాల సంఖ్య 293కు పెరిగింది.

దిల్లీలో 94వేలు దాటిన బాధితులు..

దేశ రాజధాని దిల్లీలో మరో 2,520 మందికి వైరస్ సోకింది. మొత్తంగా 94,000 వేలమందికి వైరస్ నిర్ధరణ అయింది. ఇప్పటివరకు 2,923 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్​లో 390 కొత్తగా మందికి..

రాష్ట్రంలో కొత్తగా 390 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో అక్కడ వైరస్ బాధితుల సంఖ్య 19,052కు పెరిగింది. ఒక్కరోజులో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మరణాల సంఖ్య 440కి పెరిగింది.

బంగాల్​లో 20వేలు దాటిన కేసులు..

రాష్ట్రంలో ఒక్కరోజులో 669 మందికి వైరస్ సోకింది. దీంతో అక్కడ వైరస్ బాధితుల సంఖ్య 20, 488కి చేరింది. కొత్తగా 18మంది వైరస్​కు బలయ్యారు. మొత్తంగా మృతుల సంఖ్య 717కు చేరింది. 6,200 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గుజరాత్​లో 34వేలకు పెరిగిన వైరస్ బాధితులు..

రాష్ట్రంలో కొత్తగా 687 కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ బాధితుల సంఖ్య 34,686మందికి పెరిగింది. ఒక్కరోజులో 18మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ మరణాల సంఖ్య 1,906కు చేరింది.

మధ్యప్రదేశ్​లో 14వేలు దాటిన బాధితులు..

ఒక్కరోజులో 191 మందికి వైరస్ నిర్ధరణ అయినే నేపథ్యంలో మధ్యప్రదేశ్​లో వైరస్ కేసుల సంఖ్య 14,297కు పెరిగింది. కొత్తగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 593 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తర్​ప్రదేశ్​లో 972మందికి వైరస్..

కొత్తగా 972 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజులో 14మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 25,797 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మృతుల సంఖ్య 972 కు పెరిగింది.

ఇదీ చూడండి: గ్వాలియర్ రాజా X డిగ్గీ రాజా: ఎవరు పులి?

మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 6,364 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 198మంది కొత్తగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 1,92,990 మంది వైరస్ బారినపడ్డారు. మృతుల సంఖ్య 8376కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 79, 927గా ఉంది. అయితే తాజాగా 3,515మంది వైరస్ నయమై ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. మొత్తంగా 1,04,687 మందికి వైరస్ నయమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,49,227 వైరస్ పరీక్షలు నిర్వహించారు.

తమిళనాడులో కొత్తగా 4వేలమందికి..

తమిళనాడులో కరోనా విలయం సృష్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,329 కేసులు నిర్ధరణ అయినట్లు తమిళనాడు వైద్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,02,721కి చేరింది. కొత్త కేసుల్లో 2,082 మంది బాధితులను చెన్నైలోనే గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

కర్ణాటకలో ఒక్కరోజులో 1,694 మందికి..

రాష్ట్రంలో కొత్తగా 1,694 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో అక్కడ వైరస్ బాధితుల సంఖ్య 17,710కి పెరిగింది. ఒక్కరోజులో 21మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మరణాల సంఖ్య 293కు పెరిగింది.

దిల్లీలో 94వేలు దాటిన బాధితులు..

దేశ రాజధాని దిల్లీలో మరో 2,520 మందికి వైరస్ సోకింది. మొత్తంగా 94,000 వేలమందికి వైరస్ నిర్ధరణ అయింది. ఇప్పటివరకు 2,923 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్​లో 390 కొత్తగా మందికి..

రాష్ట్రంలో కొత్తగా 390 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో అక్కడ వైరస్ బాధితుల సంఖ్య 19,052కు పెరిగింది. ఒక్కరోజులో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మరణాల సంఖ్య 440కి పెరిగింది.

బంగాల్​లో 20వేలు దాటిన కేసులు..

రాష్ట్రంలో ఒక్కరోజులో 669 మందికి వైరస్ సోకింది. దీంతో అక్కడ వైరస్ బాధితుల సంఖ్య 20, 488కి చేరింది. కొత్తగా 18మంది వైరస్​కు బలయ్యారు. మొత్తంగా మృతుల సంఖ్య 717కు చేరింది. 6,200 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గుజరాత్​లో 34వేలకు పెరిగిన వైరస్ బాధితులు..

రాష్ట్రంలో కొత్తగా 687 కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ బాధితుల సంఖ్య 34,686మందికి పెరిగింది. ఒక్కరోజులో 18మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ మరణాల సంఖ్య 1,906కు చేరింది.

మధ్యప్రదేశ్​లో 14వేలు దాటిన బాధితులు..

ఒక్కరోజులో 191 మందికి వైరస్ నిర్ధరణ అయినే నేపథ్యంలో మధ్యప్రదేశ్​లో వైరస్ కేసుల సంఖ్య 14,297కు పెరిగింది. కొత్తగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 593 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తర్​ప్రదేశ్​లో 972మందికి వైరస్..

కొత్తగా 972 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజులో 14మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 25,797 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మృతుల సంఖ్య 972 కు పెరిగింది.

ఇదీ చూడండి: గ్వాలియర్ రాజా X డిగ్గీ రాజా: ఎవరు పులి?

Last Updated : Jul 3, 2020, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.