ETV Bharat / bharat

కరోనా కలవరం: దేశంలో 600 దాటిన మృతుల సంఖ్య

author img

By

Published : Apr 21, 2020, 6:30 PM IST

దేశవ్యాప్తంగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది మహమ్మారి కొవిడ్​. మృతుల సంఖ్య ఈ రోజు 603కు పెరిగింది. గుజరాత్​లో మరో 127 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.

Corona cases crossing 18,000 in India
ఇండియా కరోనా: 18వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా క్రమంగా వేగం పెంచింది. ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. దేశంలో కేసుల సంఖ్య 18,985కు చేరగా మరణాల సంఖ్య 603కు పెరిగింది.

Corona cases crossing 18,000 in India
దేశంలో కరోనా కేసు వివరాలు

కరోనా ప్రభావం ఇలా..

  • రాజస్థాన్​లో మంగళవారం మరో 83 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇందులో 63 కేసులు జైపుర్​కు చెందినవే. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,659 మంది మహమ్మారి బారిన పడ్డారు. 25 మంది వైరస్​కు బలికాగా.. జైపుర్​లో 13 మంది మరణించారు.
  • కర్ణాటకలో 80 ఏళ్ల వ్యక్తి కరోనాకు బలయ్యాడు. రాష్ట్రంలో వైరస్​ కారణంగా మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. ఈరోజు మరో 7 కేసులు నమోదు కాగా కొవిడ్​ బాధితల సంఖ్య 415కు పెరిగింది.
  • గుజరాత్​లో మెత్తం కరోనా కేసులు 2 వేలు దాటిపోయాయి. నేడు కొత్తగా 127 మందికి ఈ మహమ్మారి సోకింది. మరో ఆరుగురు మరణించగా.. మృతుల సంఖ్య 77కు చేరింది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 1,294కు పెరిగనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 1,131 యాక్టీవ్​ కేసులున్నాయని పేర్కొన్నారు. 140 మంది వైరస్​నుంచి కోలుకొని డిశ్చార్జ్​ అయినట్లు వివరించారు.
  • మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. మృతులు, కేసుల జాబితాలో దేశంలో మహారాష్ట్ర అగ్రస్థానంల ో కొనసాగుతోంది. మొత్తం 232 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా క్రమంగా వేగం పెంచింది. ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. దేశంలో కేసుల సంఖ్య 18,985కు చేరగా మరణాల సంఖ్య 603కు పెరిగింది.

Corona cases crossing 18,000 in India
దేశంలో కరోనా కేసు వివరాలు

కరోనా ప్రభావం ఇలా..

  • రాజస్థాన్​లో మంగళవారం మరో 83 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇందులో 63 కేసులు జైపుర్​కు చెందినవే. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,659 మంది మహమ్మారి బారిన పడ్డారు. 25 మంది వైరస్​కు బలికాగా.. జైపుర్​లో 13 మంది మరణించారు.
  • కర్ణాటకలో 80 ఏళ్ల వ్యక్తి కరోనాకు బలయ్యాడు. రాష్ట్రంలో వైరస్​ కారణంగా మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. ఈరోజు మరో 7 కేసులు నమోదు కాగా కొవిడ్​ బాధితల సంఖ్య 415కు పెరిగింది.
  • గుజరాత్​లో మెత్తం కరోనా కేసులు 2 వేలు దాటిపోయాయి. నేడు కొత్తగా 127 మందికి ఈ మహమ్మారి సోకింది. మరో ఆరుగురు మరణించగా.. మృతుల సంఖ్య 77కు చేరింది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 1,294కు పెరిగనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 1,131 యాక్టీవ్​ కేసులున్నాయని పేర్కొన్నారు. 140 మంది వైరస్​నుంచి కోలుకొని డిశ్చార్జ్​ అయినట్లు వివరించారు.
  • మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. మృతులు, కేసుల జాబితాలో దేశంలో మహారాష్ట్ర అగ్రస్థానంల ో కొనసాగుతోంది. మొత్తం 232 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.