ETV Bharat / bharat

లోక్​సభలో కాంగ్రెస్​కు సారథి లేరు, వ్యూహం లేదు!

నేటి నుంచి 17వ లోక్​సభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్​లో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ తరపున లోక్​సభ పక్షనేతగా ఎవరు ఉంటారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. రాహుల్​గాంధీ ఈ బాధ్యత స్వీకరించకపోతే, అధిర్ రంజన్​ చౌదరి, కె.సురేశ్, శశిథరూర్​, మనీశ్​తివారిల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.​

author img

By

Published : Jun 17, 2019, 4:47 AM IST

Updated : Jun 17, 2019, 7:16 AM IST

కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత.... ఎవరు?
కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత.... ఎవరు?

నేడు పార్లమెంట్ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్నా... కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ లోక్​సభ పక్షనేతను ప్రకటించలేదు. ఈ బాధ్యతలు పార్టీ అధ్యక్షుడు రాహుల్​గాంధీ చేపడతారా, మరో నేతకు అప్పగిస్తారా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు.

16వ లోక్​సభలో కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే తాజా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఖర్గే ఓటమి, లోక్​సభ పక్షనేత ఎన్నికపై రాహుల్​ మౌనం ఫలితంగా మరో నేతను పార్టీ ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాహుల్​ కాకపోతే ఎవరు..?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ ప్రస్తుతం లోక్​సభలో రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్​ పట్టుబడుతున్నారు. రాహుల్​ నిష్క్రమణను పార్టీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్​సభ పక్షనేతగా రాహుల్​గాంధీయే బాధ్యతలు చేపడతారా? లేదా మరొకరికి అప్పగిస్తారా? అన్నదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.

బంగాల్​ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్​ రంజన్ చౌదరి, కేరళకు చెందిన కె.సురేశ్​లో ఒకరిని కాంగ్రెస్ లోక్​సభ పక్షనేతగా ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్​ నాయకులు శశిథరూర్​, మనీశ్ ​తివారీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

విధేయులకే అవకాశమా..?

కేరళ తిరువనంతపురం నుంచి హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న శశిథరూర్​, లోక్​సభ పక్షనేతగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమేనని ఇప్పటికే స్పష్టం చేశారు.
అయితే గాంధీ కుటుంబానికి విధేయుడు, హిందీ, ఆంగ్లభాషల్లో పట్టున్న నాయకుడు ఎవరన్నదానిపై కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం జరుగుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే శశిథరూర్​, మనీశ్​ తివారీల్లో ఒకరిని ఎన్నుకునే అవకాశం ఉంది.

17వ లోక్​సభ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో సభపక్షనేతతో పాటు, డిప్యూటీ లీడర్​, చీఫ్ విప్, విప్ నియామకాలు చేపట్టాల్సి ఉంది.

ఉమ్మడి వ్యూహం కరవు!

బడ్జెట్​ సమావేశాల్లో అధికార భాజపాను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి ఇతర విపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఎలాంటి సమావేశాన్ని నిర్వహించలేదు.

ఇదీ చూడండి: పార్లమెంటు సమావేశాలకు ముందు భాజపా భేటీ...

కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత.... ఎవరు?

నేడు పార్లమెంట్ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్నా... కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ లోక్​సభ పక్షనేతను ప్రకటించలేదు. ఈ బాధ్యతలు పార్టీ అధ్యక్షుడు రాహుల్​గాంధీ చేపడతారా, మరో నేతకు అప్పగిస్తారా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు.

16వ లోక్​సభలో కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే తాజా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఖర్గే ఓటమి, లోక్​సభ పక్షనేత ఎన్నికపై రాహుల్​ మౌనం ఫలితంగా మరో నేతను పార్టీ ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాహుల్​ కాకపోతే ఎవరు..?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ ప్రస్తుతం లోక్​సభలో రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్​ పట్టుబడుతున్నారు. రాహుల్​ నిష్క్రమణను పార్టీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్​సభ పక్షనేతగా రాహుల్​గాంధీయే బాధ్యతలు చేపడతారా? లేదా మరొకరికి అప్పగిస్తారా? అన్నదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.

బంగాల్​ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్​ రంజన్ చౌదరి, కేరళకు చెందిన కె.సురేశ్​లో ఒకరిని కాంగ్రెస్ లోక్​సభ పక్షనేతగా ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్​ నాయకులు శశిథరూర్​, మనీశ్ ​తివారీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

విధేయులకే అవకాశమా..?

కేరళ తిరువనంతపురం నుంచి హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న శశిథరూర్​, లోక్​సభ పక్షనేతగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమేనని ఇప్పటికే స్పష్టం చేశారు.
అయితే గాంధీ కుటుంబానికి విధేయుడు, హిందీ, ఆంగ్లభాషల్లో పట్టున్న నాయకుడు ఎవరన్నదానిపై కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం జరుగుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే శశిథరూర్​, మనీశ్​ తివారీల్లో ఒకరిని ఎన్నుకునే అవకాశం ఉంది.

17వ లోక్​సభ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో సభపక్షనేతతో పాటు, డిప్యూటీ లీడర్​, చీఫ్ విప్, విప్ నియామకాలు చేపట్టాల్సి ఉంది.

ఉమ్మడి వ్యూహం కరవు!

బడ్జెట్​ సమావేశాల్లో అధికార భాజపాను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి ఇతర విపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఎలాంటి సమావేశాన్ని నిర్వహించలేదు.

ఇదీ చూడండి: పార్లమెంటు సమావేశాలకు ముందు భాజపా భేటీ...

Dantewada (Chhattisgarh), May 01 (ANI): A Naxal carrying a bounty of Rs 5 lakh on her head for her alleged involvement in attacks on security forces and killing villagers was arrested on Tuesday, police said. "We arrested a Naxal woman who was actively involved in launching attacks on security forces and killing villagers in Malangir area. She was a member of the Malangir area committee of Maoists and carrying a reward of Rs 5 lakh on her head," said Dantewada Superintendent of Police (SP) Abhishek Pallava, while speaking to media. The ultra has been identified as Kosi alias Mangli. "Kosi has been active in Nahadi, Barrem, Nilawaya, Potali and Kakadi villages of the district for the past several years. She was active in Naxal organisation since 2011. She along with seven other Naxals was sent to a village in Malangir. They all were sent to increase their contact in the village," Pallava said. Kosi was held by a joint team of local police and District Reserve Guard (DRG) during a search operation.
Last Updated : Jun 17, 2019, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.