జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణపై స్పందించారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడిని ఖండించారు. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు దేశంలో.. ముఖ్యంగా విశ్వవిద్యాలయ్యాల్లో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
"గతరాత్రి జేఎన్యూ వర్సిటీలో జరిగిన ఘర్షణను ఖండిస్తున్నా. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, వామపక్ష పార్టీలు దేశంలో, ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో హింసను, అశాంతిని రేకెత్తించేందుకు యత్నిస్తున్నాయి. దీనిపై విచారణ జరగాలి."
-ప్రకాశ్ జావడేకర్, కేంద్రమంత్రి
ఘటన జరిగిన సమయంలో వర్సిటీ ప్రాంగణంలో కొంతమంది రాజకీయ నేతలు ఉన్నారని, వారి కుట్రతోనే ఈ ఘర్షణ చెలరేగిందని ఆరోపించారు జావడేకర్. ఘర్షణ తలెత్తిన 10 నిమిషాల్లోనే యోగేంద్ర యాదవ్ అనే నేత వర్సిటీకి చేరుకున్నారని.. ఇది గమనించాల్సిన అంశమని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా వర్సిటీ కార్యకలాపాలను సజావుగా సాగనివ్వని వారెవరో గుర్తించాలన్నారు.
ఇదీ చూడండి: పౌరచట్టంపై విపక్షాలవి అబద్ధాలు: అమిత్షా