ఒడిశా మల్కన్గిరి జిల్లాలో నక్సలైట్లు ఏకంగా ఓ ఆయుధ కర్మాగారాన్నే నిర్మించుకున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ ఫ్యాక్టరీని గుర్తించారు. ఓ నక్సల్ సానుభూతిపరుడిని అదుపులోకి తీసుకున్నారు.
"సుక్మా జిల్లా గాడిరాస్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాసవయ గ్రామానికి సమీపంలో 40 ఏళ్ల మాద్వి జోగా అనే నక్సలైట్ను అరెస్టు చేశాం. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఆయుధ కర్మాగారాన్ని గుర్తించాం."
- శలాబ్ సిన్హా, సుక్మా పోలీసు సూపరింటెండెంట్
కాటేకాలియన్ ప్రాంతంలోని మావోయిస్టు కార్యక్రమాల్లో మాద్వి జోగాది కీలక పాత్ర. గత 7-8 ఏళ్లుగా అతను నిషేధిత (సీపీఐ) నక్సలైట్లతో కలిసి పనిచేస్తున్నాడు. ఒడిశా మల్కన్గిరి జిల్లాలోని భాస్రిగూడకు చెందిన నక్సల్ సానుభూతిపరుడు జగన్నాథ్ బర్నాయ్ నడిపే కర్మాగారంలో నాటు తుపాకులు చేయించి, మావోయిస్టులకు సరఫరా చేసేవాడు. ఇప్పటికే వీరు 35 మజిల్ లోడింగ్ తుపాకులను నక్సలైట్లకు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.
బర్నాయ్ను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. అతడి ఇంటి నుంచి రెండు మజిల్ లోడింగ్ గన్స్, 10 బారెల్స్ ఆఫ్ గన్స్, గన్ బట్స్, ఆయుధాల తయారీకి వాడే పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: 'ఉగ్రవాదులతో పీఓకే ఫుల్- ఏ క్షణమైనా భారత్లోకి...'