గణతంత్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా జరిగే బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశరాజధాని దిల్లీలోని విజయ్చౌక్లో కన్నులపండువగా బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం సాగింది. సైన్యానికి చెందిన 14 సంగీత బ్యాండ్లు.. ఈ ఏడాది ప్రదర్శన ఇచ్చాయి.
కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన సేనలు.. తిరిగి స్థావరాలకు వెళ్లేందుకు ఈ వేడుకను ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తారు.
ఇదీ చూడండి:- నిరసనకారులకు 'కారం'తో సామాన్యుడి జవాబు!