ETV Bharat / bharat

9నెలల్లో బాబ్రీ కేసు తీర్పు ఇవ్వాలి: సుప్రీం

బాబ్రీ కేసుపై 9 నెలల్లోగా తీర్పు వెలువరించాలని ప్రత్యేక న్యాయమూర్తికి సూచించింది సుప్రీంకోర్టు. 1992 నాటి ఈ కేసులో భాజపా నేతలు ఎల్​.కే అడ్వాణీ, ఎంఎం జోషిలపై ఆరోపణలున్నాయి.

author img

By

Published : Jul 19, 2019, 2:14 PM IST

9నెలల్లో బాబ్రీ కేసు తీర్పు ఇవ్వాలి: సుప్రీం

ఆరు నెలల్లోగా బాబ్రీ మసీదు కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల సేకరణ పూర్తి చేయాలని ప్రత్యేక న్యాయమూర్తికి స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణ పూర్తి చేసి 9నెలల్లోపు తీర్పు వెల్లడించాలని ప్రత్యేక న్యాయమూర్తికి సూచించింది.

ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.కే యాదవ్ పదవీకాలం 2019 సెప్టెంబరు 30న ముగియనుంది. దీనిని పొడిగించాలని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ విషయంపై నాలుగు వారాల్లో ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేసింది. కేవలం బాబ్రీ కేసు విచారణ నిమిత్తమే జస్టిస్​ యాదవ్​ పదవీకాలం పొడిగిస్తున్నట్లు తెలిపింది సుప్రీం. ఈ కేసు విచారణ పూర్తి చేసేందుకు మరో ఆరు నెలల గడువు కావాలని సోమవారం సుప్రీంను ఆశ్రయించారు జస్టిస్ యాదవ్.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాజపా సీనియర్ నేతలు ఎల్​.కే అడ్వాణీ, ఎం.ఎం.జోషీ, ఉమాభారతిలపై ఆరోపణలున్నాయి. వీరితో పాటు కమలం పార్టీ ఎంపీ వినయ్​ కతియార్, సాధ్వి రితంబరలపై 2017 ఏప్రిల్ 19న అభియోగాలు దాఖలయ్యాయి.

ఇదీ చూడండి:- 'ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. నాకొద్దీ భద్రత'

ఆరు నెలల్లోగా బాబ్రీ మసీదు కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల సేకరణ పూర్తి చేయాలని ప్రత్యేక న్యాయమూర్తికి స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణ పూర్తి చేసి 9నెలల్లోపు తీర్పు వెల్లడించాలని ప్రత్యేక న్యాయమూర్తికి సూచించింది.

ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.కే యాదవ్ పదవీకాలం 2019 సెప్టెంబరు 30న ముగియనుంది. దీనిని పొడిగించాలని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ విషయంపై నాలుగు వారాల్లో ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేసింది. కేవలం బాబ్రీ కేసు విచారణ నిమిత్తమే జస్టిస్​ యాదవ్​ పదవీకాలం పొడిగిస్తున్నట్లు తెలిపింది సుప్రీం. ఈ కేసు విచారణ పూర్తి చేసేందుకు మరో ఆరు నెలల గడువు కావాలని సోమవారం సుప్రీంను ఆశ్రయించారు జస్టిస్ యాదవ్.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాజపా సీనియర్ నేతలు ఎల్​.కే అడ్వాణీ, ఎం.ఎం.జోషీ, ఉమాభారతిలపై ఆరోపణలున్నాయి. వీరితో పాటు కమలం పార్టీ ఎంపీ వినయ్​ కతియార్, సాధ్వి రితంబరలపై 2017 ఏప్రిల్ 19న అభియోగాలు దాఖలయ్యాయి.

ఇదీ చూడండి:- 'ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. నాకొద్దీ భద్రత'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Shanghai, China. 19th July 2019.
+++SHOTLIST TO FOLLOW+++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: NUTV
DURATION: 01:55
STORYLINE:
+++TO FOLLOW+++
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.