మహారాష్ట్రలో విరుచుకుపడిన 'నిసర్గ' తుపాను ముంబయి నగరంపై సానుకూల ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు. గురువారం నాటికి గాలి నాణ్యత 17కు చేరినట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో నమోదైన వాటిలో ఇదే అత్యుత్తమమైనదని వాతావరణ అంచనా పరిశోధనా వ్యవస్థ (ఎస్ఏఎఫ్ఏఆర్) తెలిపింది.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన సూచీలో అత్యుత్తమైనది ఇదే. అధిక వేగంతో వీచిన గాలులు, వర్షపాతం.. గాలి నాణ్యత మెరుగుపడేందుకు కారణమయ్యాయి.
డాక్టర్. గుఫ్రాన్ బీగ్, ఎస్ఏఎఫ్ఏఆర్ డైరెక్టర్
శుక్రవారం నాటికి గాలి నాణ్యత 15కు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సాధారణంగా గాలి నాణ్యత సూచీ 0 నుంచి 50 వరకు నమోదైతే మంచిదిగా పరిగణిస్తారు. 51 నుంటి 100 వరకు సంతృప్తికరంగా, 101 నుంచి 200 వరకు ఫర్వాలేదని సూచిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే ప్రమాదకరంగా భావిస్తారు.