ఝూర్ఖండ్ ధన్బాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గోవింద్ పూర్-సాహిబ్గంజ్ రహదారి పక్కన ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన వేగనార్ కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు పిల్లలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను ధన్బాద్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. బాధితులు ధన్బాద్ నుంచి జాంతార్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


మరో ఘటనలో..
గుజరాత్లోని వల్సాడ్ ప్రాంతంలో బస్సు బోల్తా పడి 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సూరత్ నుంచి బెంగుళూరు వెళ్తుండగా 48వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో గాయపడ్డ 20 మందిని వల్సాడ్ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: 'బాబా కా దాబా' విరాళాల పేరుతో మోసం!