రాజస్థాన్ జైపుర్లో కరోనా మహమ్మారి తీవ్ర కలకలం రేపుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా చార్దీవారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 26 మంది కరోనా బారిన పడ్డట్లు వైద్యులు నిర్ధరించారు.
విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్క ఇంట్లో ఇంత ఎక్కువ మందికి కరోనా సోకడం ఇదే తొలిసారి అంటున్నారు. దీంతో ఆ ఇంటి ముందు అంబులెన్స్లు బారులు తీరాయి. రాత్రికి రాత్రే 26 మందిని ఆసుపత్రికి తరలించారు. జైపుర్ జిల్లాలో ఇప్పటికే 2260 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.