ETV Bharat / bharat

ఇదే మొదటిసారి?...ఒకే ఇంట్లో 26 మందికి కరోనా - corona virus to 26 members of same family in jaipur

రాజస్థాన్​లోని జైపుర్​లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. దీంతో రాత్రికి రాత్రే బాధితులను ఆసుపత్రికి తరలించారు అధికారులు.

26-people-of-same-family-found-corona-positive-in-jaipur
ఒకే ఇంట్లో 26 మందికి కరోనా పాజిటివ్​!
author img

By

Published : Jun 9, 2020, 12:15 PM IST

Updated : Jun 9, 2020, 2:18 PM IST

రాజస్థాన్​ జైపుర్​లో కరోనా మహమ్మారి తీవ్ర కలకలం రేపుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా చార్​దీవారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 26 మంది కరోనా బారిన పడ్డట్లు వైద్యులు నిర్ధరించారు.

విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్క ఇంట్లో ఇంత ఎక్కువ మందికి కరోనా సోకడం ఇదే తొలిసారి అంటున్నారు. దీంతో ఆ ఇంటి ముందు అంబులెన్స్​లు బారులు తీరాయి. రాత్రికి రాత్రే 26 మందిని ఆసుపత్రికి తరలించారు. జైపుర్​ జిల్లాలో ఇప్పటికే 2260 మందికి కరోనా వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.

రాజస్థాన్​ జైపుర్​లో కరోనా మహమ్మారి తీవ్ర కలకలం రేపుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా చార్​దీవారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 26 మంది కరోనా బారిన పడ్డట్లు వైద్యులు నిర్ధరించారు.

విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్క ఇంట్లో ఇంత ఎక్కువ మందికి కరోనా సోకడం ఇదే తొలిసారి అంటున్నారు. దీంతో ఆ ఇంటి ముందు అంబులెన్స్​లు బారులు తీరాయి. రాత్రికి రాత్రే 26 మందిని ఆసుపత్రికి తరలించారు. జైపుర్​ జిల్లాలో ఇప్పటికే 2260 మందికి కరోనా వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.

ఇదీ చదవండి:సరిహద్దు వేదికగా మూడుముళ్లు.. వంతెనపై ఏడడుగులు!

Last Updated : Jun 9, 2020, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.