ఆర్టికల్ 370 రద్దు అనంతరం నెలకొన్న పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు 25మంది ఐరోపా సమాఖ్య, ఇతర దేశాల ప్రతినిధులు కశ్మీర్లో పర్యటిస్తున్నారు. తొలుత శ్రీనగర్కు చెరుకున్న ప్రతినిధులు దాల్ సరస్సును సందర్శించారు. అనంతరం స్థానికులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
కశ్మీర్లో పర్యటిస్తున్న విదేశీ బృందంలో జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, మెక్సికో, ఇటలీ, అఫ్గానిస్థాన్, ఆస్ట్రియా, ఉజ్బెకిస్థాన్, పోలాండ్తోపాటు ఐరోపా సమాఖ్యకు చెందిన రాయబారులు ఉన్నారు.
ఇంతకుముందు..
ఇంతకుముందే ఐరోపా సమాఖ్యకు చెందిన 23 మంది ఎంపీలు కశ్మీర్ను సందర్శించారు. అయితే నాటి పర్యటనపై ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాన్-అలైన్డ్ స్టడీస్ విమర్శలు చేసింది. కేవలం ఒక వర్గం వారినే ప్రభుత్వం ఈ పర్యటనకు ఆహ్వానించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రతినిధుల పర్యటనకు ప్రభుత్వం దూరంగా ఉంది. ఐరోపా సమాఖ్య పార్లమెంట్ సభ్యుల పర్యటన వారి వ్యక్తిగతమైనదని వెల్లడించింది.
పౌరసత్వ చట్ట సవరణ, కశ్మీర్ అంశంపై గత నెలలో ఈయూ పార్లమెంట్లో జరిగిన చర్చపై ఓటింగ్ నిర్వహించే అవకాశాలున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.