ఎన్సీపీ అధినేత శరద్ పవార్కి చెందిన ఇద్దరు భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. దీంతో పవార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
పవార్కు మొత్తం ఆరుగురు సిబ్బంది భద్రతను కల్పిస్తున్నారు. వీరంతా ముంబయిలోని నివాసం వద్ద విధులు నిర్వరిస్తున్నారు. వీరికి ఆదివారం వైరస్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి సోకినట్లు తేలింది. ఈ సిబ్బంది ఎన్సీపీ అధినేతతో సన్నిహతంగా లేరని సమాచారం.
టీఎంసీ ఎమ్మెల్యే మృతి..
బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సమరేశ్ దాస్ కరోనాతో మృతి చెందారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు తెలిపారు.
కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధరణ కావటం వల్ల ఆసుపత్రిలో చేరారు దాస్. అప్పటికే గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
ఎగ్రా నియోజక వర్గం నుంచి మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు దాస్. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
ఇదీ చూడండి 'విషమంగానే ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి'