బిహార్లోని పట్నా గయా సెక్షన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పోటాహి-నద్వాన్ మధ్య రైల్వే ట్రాక్ను దాటుతున్న ఓ కారును ట్రైన్ ఢీకొంది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అయితే రైలు ప్రయాణానికి ఎలాంటి అంతరాయం కలగలేదని భారతీయ రైల్వే తెలిపింది.
ఓ వైపు రైలు వస్తుంటే... కారులోని వ్యక్తులు నిర్లక్ష్యంగా ట్రాక్పై నుంచి కారును పోనిచ్చారని, అందువల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: చైనా 'ఇరాన్' తంత్రం.. ఎందుకీ దోస్తీ?