ETV Bharat / bharat

'ఆర్టికల్ 370 రద్దు అనంతరం 190 రాళ్లదాడి ఘటనలు'

author img

By

Published : Dec 19, 2019, 5:53 AM IST

ఆర్టికల్ రద్దు అనంతరం కశ్మీర్ వ్యాప్తంగా 190 రాళ్లదాడులు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్​కు సంబంధించి పలు అంశాలపై గణాంకాలను విడుదల చేశారు. కశ్మీర్​కు స్వయంప్రతిపత్తి రద్దు అనంతరం సరిహద్దు వెంట 171 చొరబాటు యత్నాలు జరగగా 114మంది, వారి ప్రయత్నాల్లో సఫలమయ్యారని వెల్లడించారు.

MHA-JK-LD STONE PELTING
'ఆర్టికల్ 370 రద్దు అనంతరం 190 రాళ్లదాడి ఘటనలు'

ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్​లోయలో 190 రాళ్లదాడి ఘటనలు జరిగాయని వెల్లడించారు అధికారులు. ఇందుకు కారణమైన 250మంది ప్రస్తుతం జైళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్​కు సంబంధించిన పలు గణాంకాలను అధికారులు విడుదల చేశారు. మొత్తంగా 2019లో 544 రాళ్లదాడులు జరిగాయని స్పష్టం చేశారు.

డిసెంబర్ 8 వరకు ఉన్న గణాంకాల ప్రకారం 356మంది వివిధ అభియోగాల కింద జైళ్లలో ఉండగా అందులో 250మంది రాళ్లదాడికి పాల్పడిన వారని విశదీకరించారు. 2018లో 802 రాళ్లదాడులు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.

చొరబాట్ల ద్వారా 114మంది

సరిహద్దు వెంబడి 171 చొరబాటు యత్నాలు జరిగాయని.. అందులో 114 విజయవంతమయ్యాయని స్పష్టం చేశారు. ఆగస్టులో 32 మంది, సెప్టెంబర్​లో 20, అక్టోబర్​లో ఏడుగురు చొరబాటుదారులు దేశంలో ప్రవేశించారని అధికారులు వెల్లడించారు.

అదే సమయంలో 2018లో 143మంది చొరబాటుదారులు దేశంలో అడుగుపెట్టారని, 2017, 2016 సంవత్సరాల్లో వరుసగా 190, 119మంది సరిహద్దు గుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని వ్యాఖ్యానించారు.

యాపిల్ ఉత్పత్తిలో..

జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య(నాఫెడ్) ద్వారా 15.49 లక్షల మిలియన్ టన్నుల యాపిల్ పంటను కశ్మీర్​లో ఉత్పత్తి చేశారని అధికారులు వెల్లడించారు. మార్చి నాటికి 22.5 మిలియన్​ టన్నుల ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ల అభివృద్ధికి రూ. 4వేల కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసిందని అధికారులు వెల్లడించారు.

ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్​లోయలో 190 రాళ్లదాడి ఘటనలు జరిగాయని వెల్లడించారు అధికారులు. ఇందుకు కారణమైన 250మంది ప్రస్తుతం జైళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్​కు సంబంధించిన పలు గణాంకాలను అధికారులు విడుదల చేశారు. మొత్తంగా 2019లో 544 రాళ్లదాడులు జరిగాయని స్పష్టం చేశారు.

డిసెంబర్ 8 వరకు ఉన్న గణాంకాల ప్రకారం 356మంది వివిధ అభియోగాల కింద జైళ్లలో ఉండగా అందులో 250మంది రాళ్లదాడికి పాల్పడిన వారని విశదీకరించారు. 2018లో 802 రాళ్లదాడులు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.

చొరబాట్ల ద్వారా 114మంది

సరిహద్దు వెంబడి 171 చొరబాటు యత్నాలు జరిగాయని.. అందులో 114 విజయవంతమయ్యాయని స్పష్టం చేశారు. ఆగస్టులో 32 మంది, సెప్టెంబర్​లో 20, అక్టోబర్​లో ఏడుగురు చొరబాటుదారులు దేశంలో ప్రవేశించారని అధికారులు వెల్లడించారు.

అదే సమయంలో 2018లో 143మంది చొరబాటుదారులు దేశంలో అడుగుపెట్టారని, 2017, 2016 సంవత్సరాల్లో వరుసగా 190, 119మంది సరిహద్దు గుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని వ్యాఖ్యానించారు.

యాపిల్ ఉత్పత్తిలో..

జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య(నాఫెడ్) ద్వారా 15.49 లక్షల మిలియన్ టన్నుల యాపిల్ పంటను కశ్మీర్​లో ఉత్పత్తి చేశారని అధికారులు వెల్లడించారు. మార్చి నాటికి 22.5 మిలియన్​ టన్నుల ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ల అభివృద్ధికి రూ. 4వేల కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసిందని అధికారులు వెల్లడించారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.