ETV Bharat / bharat

ఐపీఎస్​ సహా 13 మంది పోలీసులకు కరోనా

author img

By

Published : May 5, 2020, 10:09 AM IST

Updated : May 5, 2020, 10:42 AM IST

Mh_mum_01_05_mumbai_police_7201159
ఐపీఎస్​ సహా 13 మంది పోలీసులకు కరోనా

10:31 May 05

మహారాష్ట్రలోని ముంబయి పోలీసు విభాగంలో కరోనా కలకలం రేగింది. ఓ ఐపీఎస్​ అధికారి సహా.. మొత్తం 13 మంది పోలీసు సిబ్బందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ వార్తతో నగర పోలీసు శాఖ అప్రమత్తమైంది. అందరినీ ఐసోలేషన్​కు తరలించింది.  

వివరాల ప్రకారం.. ఆ ఐపీఎస్​ అధికారి డ్రైవర్​ కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. ముందు జాగ్రత్తగా తన కూడా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​గా తేలింది. మరో 12 మంది పోలీసు సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం.. వీరితో సన్నిహితంగా మెలిగిన మరో 48 మందిని క్వారంటైన్​ చేశారు. మిగతా వారిని గుర్తించే పనిలో పడ్డారు.  

జేజే మార్గ్​ పోలీస్​ స్టేషన్​కు చెందిన ఈ 12 మంది పోలీసు సిబ్బంది.. కొద్ది రోజులుగా గస్తీ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అస్వస్థత లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా కరోనా నిర్ధరణ అయింది. 

10:06 May 05

ఐపీఎస్​ సహా 13 మంది పోలీసులకు కరోనా

ముంబయిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఐపీఎస్​ అధికారి సహా మొత్తం 13 మంది పోలీసులకు వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. వీరందరినీ ఆస్పత్రికి తరలించారు. వీరితో సన్నిహితంగా మెలిగిన వారిని స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ఆదేశించారు.

10:31 May 05

మహారాష్ట్రలోని ముంబయి పోలీసు విభాగంలో కరోనా కలకలం రేగింది. ఓ ఐపీఎస్​ అధికారి సహా.. మొత్తం 13 మంది పోలీసు సిబ్బందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ వార్తతో నగర పోలీసు శాఖ అప్రమత్తమైంది. అందరినీ ఐసోలేషన్​కు తరలించింది.  

వివరాల ప్రకారం.. ఆ ఐపీఎస్​ అధికారి డ్రైవర్​ కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. ముందు జాగ్రత్తగా తన కూడా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​గా తేలింది. మరో 12 మంది పోలీసు సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం.. వీరితో సన్నిహితంగా మెలిగిన మరో 48 మందిని క్వారంటైన్​ చేశారు. మిగతా వారిని గుర్తించే పనిలో పడ్డారు.  

జేజే మార్గ్​ పోలీస్​ స్టేషన్​కు చెందిన ఈ 12 మంది పోలీసు సిబ్బంది.. కొద్ది రోజులుగా గస్తీ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అస్వస్థత లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా కరోనా నిర్ధరణ అయింది. 

10:06 May 05

ఐపీఎస్​ సహా 13 మంది పోలీసులకు కరోనా

ముంబయిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఐపీఎస్​ అధికారి సహా మొత్తం 13 మంది పోలీసులకు వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. వీరందరినీ ఆస్పత్రికి తరలించారు. వీరితో సన్నిహితంగా మెలిగిన వారిని స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ఆదేశించారు.

Last Updated : May 5, 2020, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.