ETV Bharat / bharat

పంజాబ్​లో 'ఆప్' మార్క్.. వారికి భద్రత కట్.. ప్రజాసేవకు వందలాది పోలీసులు!

author img

By

Published : Mar 13, 2022, 5:40 PM IST

Bhagwant mann news: పంజాబ్​లో ఆప్​ మార్క్ పాలన షురూ అయింది. రాష్ట్రంలోని 122 మంది నేతలకు భద్రతను తగ్గిస్తున్నట్లు పంజాబ్​ సీఎం అభ్యర్థి భగవంత్​ మాన్ తెలిపారు. ఫలితంగా వందలాది మంది పోలీసులు ఇకపై సామాన్యులకే సేవలు అందిస్తారని స్పష్టం చేశారు. మరోవైపు పంజాబ్​కు నిజాయితీ గల సీఎం రానున్నారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

bhagavanth singh mann
భగవంత్ సింగ్ మాన్

Bhagwant mann news: పంజాబ్​లో తిరుగులేని విజయం సాధించిన ఆమ్​ఆద్మీ పార్టీ.. తనదైన శైలిలో పాలన అందించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికలు పూర్తైన దృష్ట్యా పంజాబ్​లోని 122 మంది నాయకుల భద్రతను తగ్గిస్తున్నట్లు పంజాబ్​ సీఎం అభ్యర్థి భగవంత్​ మాన్ తెలిపారు. దీనివల్ల 403 మంది పోలీసు సిబ్బంది, 27 పోలీస్ వాహనాలు పోలీస్ స్టేషన్​లకు వెళ్లిపోయాయని అన్నారు.

Bhagwant mann news
దుర్గామాత ఆలయంలో కేజ్రీవాల్ పూజలు

ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండొద్దని.. భగత్​ సింగ్, బాబా సాహెబ్ అంబేడ్కర్ ఫొటోలు మాత్రమే ఉండాలని ఆదేశించారు మాన్. పంజాబ్​లో ఆమ్​ఆద్మీ పార్టీకి ఘనవిజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు అమృత్​సర్​లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.

Bhagwant mann news
జలియన్ వాలా బాగ్ స్మారకం వద్ద కేజ్రీవాల్, మాన్
Bhagwant mann news
జలియన్ వాలా బాగ్ స్మారకాన్ని సందర్శించిన ఆప్ నేతలు

Arvind kejriwal news: చాలా ఏళ్ల తర్వాత పంజాబ్​కు నిజాయితీ కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రాబోతున్నారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

"నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత పంజాబ్​కు నిజాయితీ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. మాన్ చాలా నిజాయితీపరుడు. ప్రభుత్వానికి వచ్చే రూపాయి ప్రజలకోసమే ఖర్చు చేస్తాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం."

-- ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్

ఆప్​కు చెందిన రాజకీయ నేతగానీ, ఎమ్మెల్యే గానీ ఏదైనా పొరపాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కేజ్రీవాల్. పంజాబ్​లోని దిగ్గజ నేతలైన ప్రకాశ్ సింగ్ బాదల్, సుఖ్​బీర్ సింగ్ బాదల్​, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, చరణ్​జీత్ సింగ్​ చన్నీ, బిక్రమ్ సింగ్ మజితియాను ప్రజలు ఓడించి ఇంటికి పంపారని అన్నారు. కేవలం మాన్ ఒక్కరే కాదని.. పంజాబ్​లోని ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రేనన్నారు కేజ్రీవాల్.

Bhagwant mann news
అమృత్​సర్ ఆలయంలో కేజ్రీవాల్

Punjab Election Result: ఇటీవల జరిగిన పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్​ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 117 సీట్లకు గాను 92 సీట్లు కైవసం చేసుకుంది ఆప్​. పంజాబ్​ ముఖ్యమంత్రిగా భగవంత్​ సింగ్​ మాన్​ ఈనెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదివరకే ప్రకటించినట్టు.. స్వాతంత్ర్యసమర యోధుడు భగత్​సింగ్​ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్​కలన్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇవీ చూడండి: ఉత్తరాఖండ్​కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా రీతూ?

సంక్షేమానికే యూపీ ప్రజల ఓటు.. పనిచేసిన మోదీ 'మేజిక్​'!

సీఎంపై గెలిచి ఎమ్మెల్యే అయిన కుమారుడు.. తల్లి మాత్రం బడిలో స్వీపర్​గానే..

Bhagwant mann news: పంజాబ్​లో తిరుగులేని విజయం సాధించిన ఆమ్​ఆద్మీ పార్టీ.. తనదైన శైలిలో పాలన అందించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికలు పూర్తైన దృష్ట్యా పంజాబ్​లోని 122 మంది నాయకుల భద్రతను తగ్గిస్తున్నట్లు పంజాబ్​ సీఎం అభ్యర్థి భగవంత్​ మాన్ తెలిపారు. దీనివల్ల 403 మంది పోలీసు సిబ్బంది, 27 పోలీస్ వాహనాలు పోలీస్ స్టేషన్​లకు వెళ్లిపోయాయని అన్నారు.

Bhagwant mann news
దుర్గామాత ఆలయంలో కేజ్రీవాల్ పూజలు

ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండొద్దని.. భగత్​ సింగ్, బాబా సాహెబ్ అంబేడ్కర్ ఫొటోలు మాత్రమే ఉండాలని ఆదేశించారు మాన్. పంజాబ్​లో ఆమ్​ఆద్మీ పార్టీకి ఘనవిజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు అమృత్​సర్​లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.

Bhagwant mann news
జలియన్ వాలా బాగ్ స్మారకం వద్ద కేజ్రీవాల్, మాన్
Bhagwant mann news
జలియన్ వాలా బాగ్ స్మారకాన్ని సందర్శించిన ఆప్ నేతలు

Arvind kejriwal news: చాలా ఏళ్ల తర్వాత పంజాబ్​కు నిజాయితీ కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రాబోతున్నారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

"నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత పంజాబ్​కు నిజాయితీ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. మాన్ చాలా నిజాయితీపరుడు. ప్రభుత్వానికి వచ్చే రూపాయి ప్రజలకోసమే ఖర్చు చేస్తాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం."

-- ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్

ఆప్​కు చెందిన రాజకీయ నేతగానీ, ఎమ్మెల్యే గానీ ఏదైనా పొరపాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కేజ్రీవాల్. పంజాబ్​లోని దిగ్గజ నేతలైన ప్రకాశ్ సింగ్ బాదల్, సుఖ్​బీర్ సింగ్ బాదల్​, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, చరణ్​జీత్ సింగ్​ చన్నీ, బిక్రమ్ సింగ్ మజితియాను ప్రజలు ఓడించి ఇంటికి పంపారని అన్నారు. కేవలం మాన్ ఒక్కరే కాదని.. పంజాబ్​లోని ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రేనన్నారు కేజ్రీవాల్.

Bhagwant mann news
అమృత్​సర్ ఆలయంలో కేజ్రీవాల్

Punjab Election Result: ఇటీవల జరిగిన పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్​ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 117 సీట్లకు గాను 92 సీట్లు కైవసం చేసుకుంది ఆప్​. పంజాబ్​ ముఖ్యమంత్రిగా భగవంత్​ సింగ్​ మాన్​ ఈనెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదివరకే ప్రకటించినట్టు.. స్వాతంత్ర్యసమర యోధుడు భగత్​సింగ్​ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్​కలన్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇవీ చూడండి: ఉత్తరాఖండ్​కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా రీతూ?

సంక్షేమానికే యూపీ ప్రజల ఓటు.. పనిచేసిన మోదీ 'మేజిక్​'!

సీఎంపై గెలిచి ఎమ్మెల్యే అయిన కుమారుడు.. తల్లి మాత్రం బడిలో స్వీపర్​గానే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.