జీవన సౌలభ్య సూచీలో (ఈజ్ ఆఫ్ లివింగ్) సూచీలో బెంగళూరు అగ్రస్థానం దక్కించుకుంది. దేశంలోని 111 నగరాల్లో.. పుణె, అహ్మదాబాద్ వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. చెన్నై, సూరత్, నవీ ముంబయి, కోయంబత్తూర్, వడోదరా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దేశంలోని వేర్వేరు నగరాల్లో జీవనం సాగించేందుకు ఉన్న పరిస్థితులు ఆధారంగా కేంద్రం ఈ ర్యాంకులు ప్రకటించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఈ జాబితాను విడుదల చేశారు.
పది లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల ఈజ్ ఆఫ్ లివింగ్ సూచీలో సిమ్లా తొలి స్థానంలో నిలిచింది.
దిల్లీ, ఇందోర్..
10 లక్షల కంటే తక్కువ జనాభాతో మంచి పనితీరు కనబర్చిన పురపాలికల జాబితాలో న్యూ దిల్లీ మొదటిస్థానం దక్కించుకుంది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పురపాలికల్లో.. ఇందోర్ తొలిస్థానం పొందింది.
ఇదీ చూడండి: లైఫ్స్టైల్ మార్చేస్తాయ్.. ఓ లైక్ వేసుకోండి!