కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తినందుకు తనపై ఎలా దాడులకు దిగుతున్నారో.. నోబెల్ అవార్డు గ్రహీత అమర్థ్యసేన్ను కూడా భాజపా అలాగే లక్ష్యంగా చేసుకుందని బంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తన అభిప్రాయలను వెల్లడించినందుకే అమర్థ్యసేన్పై దాడులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.
విశ్వాభారతి యూనివర్సిటీ ప్రాంగణంలోని భూములను అమర్థ్యేసేన్ కుటుంబం అక్రమంగా కలిగి ఉందని ఆరోపిస్తూ.. బంగాల్ ప్రభుత్వానికి గతవారం లేఖ రాశారు యూనివర్సిటీ అధికారులు. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. అమర్థ్యసేన్కు మద్దతుగా మమతా బెనర్జీ ఆయనకు లేఖ రాశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, తనను సోదరిలా భావించాలని లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖపై అమర్థ్యసేన్ స్పందించారు. తీరిక లేని సమయంలోనూ తనకు లేఖ రాసి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం లక్ష్యంగా చేసుకున్నవారికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇవ్వడం తనకు మరింత బలాన్నిచ్చిందని పేర్కొన్నారు.