ఝార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో దారుణం జరిగింది. భర్త కళ్ల ముందే ఓ మహిళపై 17 మంది అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ అమానవీయ ఘటన జరిగింది.
ఓ మహిళ తన భర్తతో కలిసి బయటికెళ్లి పని ముగిశాక ఇంటికి తిరుగు పయనమైంది. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని దుండగులు మార్గమధ్యలో వారిని అడ్డుకున్నారు. అనంతరం వారు ఆమె భర్తపై దాడి చేసి.. అతడి కళ్లముందే మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
ఈ నేరం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు.. ముఫాసిల్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:ఆమె పాట కోసం గొడవ- డీజే మృతి