రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా కల్వా గ్రామంలో భారీ సంఖ్యలో నెమళ్లు మృతి చెందాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో 53 నెమళ్లు మృతిచెందగా మరో 26 గాయపడ్డాయి. నెమళ్ల మృతికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ దుర్ఘటనపై గ్రామసర్పంచ్ సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు.
శవపరీక్షలు నిర్వహించామని, ఫలితాలు వచ్చే వరకూ ఈ ఘటనపై స్పష్టత ఇవ్వలేమని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదన్నారు. మృతిచెందిన నెమళ్లను నాగౌర్ జిల్లా ఎస్పీ దీద్వన సంజయ్ గుప్తా, అటవీ శాఖ అధికారుల సమక్షంలో ఖననం చేశారు.
కొద్ది రోజుల క్రితం..
ఇటువంటి ఘటనే ఝలావాడ్, జోధ్పుర్ జిల్లాల్లో గురువారం జరిగింది. ఈ ఘటనలో 100 కాకులు నేలరాలాయి. ఈ ఘటనకు బర్డ్ ఫ్లూ కారణమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై-సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ లాబోరేటరీ(ఎన్హెచ్ఎస్ఏడీఎల్) నిర్ధరించింది.
ఇదీ చూడండి : మావోయిస్టు దంపతులను కొట్టి చంపిన గ్రామస్థులు