ETV Bharat / bharat

'మహా'పై కరోనా పంజా- రికార్డు స్థాయిలో కొత్త కేసులు

author img

By

Published : Mar 18, 2021, 9:58 PM IST

Updated : Mar 18, 2021, 10:16 PM IST

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకూ అధికమవుతూనే ఉన్నాయి. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 25వేల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. కొవిడ్​ విజృంభణ మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. గతంలో నమోదైన గరిష్ఠ కేసుల(24,886)ను తాజా గణాంకాలు తిరగరాశాయి.

25,833 new coronavirus cases in Maharashtra, highest since pandemic began
'మహా'పై కరోనా పంజా- రికార్డు స్థాయిలో కొత్త కేసులు

మహారాష్ట్రలో కరోనా 2.0 తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా.. 25వేల 833మందికి వైరస్​ సోకినట్టు తేలగా.. మహమ్మారి విజృంభించిన నాటి నుంచి.. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. అంతకుముందు.. గరిష్ఠంగా 24,866(సెప్టెంబర్​ 11న) కేసులు వెలుగుచూశాయి.

ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23లక్షల 96వేల 340కి చేరింది. వైరస్​ ధాటికి మరో 58మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 53వేల 138కి పెరిగింది. కొవిడ్​ సోకిన వారిలో మరో 12,764మంది కోలుకోగా.. రికవరీల సంఖ్య 21.75లక్షలకు పెరిగింది. 1.66లక్షల యాక్టివ్​ కేసులున్నాయి.

ఇదీ చదవండి: కరోనా 2.0: ఆ నగరంలో బస్సులు బంద్

దిల్లీలోనూ..

దేశ రాజధాని దిల్లీలోనూ కరోనా 2.0 మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. మరో 607 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. గత రెండున్నర నెలల్లో ఇదే అత్యధికం. ఇప్పటివరకు అక్కడ మొత్తం 10,949 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: దేశంలో భారీగా పెరిగిన కేసులు- కొత్తగా 35,871 మందికి వైరస్​

మహారాష్ట్రలో కరోనా 2.0 తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా.. 25వేల 833మందికి వైరస్​ సోకినట్టు తేలగా.. మహమ్మారి విజృంభించిన నాటి నుంచి.. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. అంతకుముందు.. గరిష్ఠంగా 24,866(సెప్టెంబర్​ 11న) కేసులు వెలుగుచూశాయి.

ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23లక్షల 96వేల 340కి చేరింది. వైరస్​ ధాటికి మరో 58మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 53వేల 138కి పెరిగింది. కొవిడ్​ సోకిన వారిలో మరో 12,764మంది కోలుకోగా.. రికవరీల సంఖ్య 21.75లక్షలకు పెరిగింది. 1.66లక్షల యాక్టివ్​ కేసులున్నాయి.

ఇదీ చదవండి: కరోనా 2.0: ఆ నగరంలో బస్సులు బంద్

దిల్లీలోనూ..

దేశ రాజధాని దిల్లీలోనూ కరోనా 2.0 మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. మరో 607 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. గత రెండున్నర నెలల్లో ఇదే అత్యధికం. ఇప్పటివరకు అక్కడ మొత్తం 10,949 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: దేశంలో భారీగా పెరిగిన కేసులు- కొత్తగా 35,871 మందికి వైరస్​

Last Updated : Mar 18, 2021, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.