గుడివాడలో మహా శివరాత్రి వేడుక.. ముఖ్యమంత్రి జగన్ పూజలు
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10961213-524-10961213-1615444851442.jpg)
కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మహా శివరాత్రి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ముఖ్యమంత్రి జగన్.. పరమశివుడి లింగానికి అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు నిర్వహించిన యాగంలో భాగంగా.. పూర్ణాహుతిలో సీఎం పాల్గొన్నారు. ఈ వేడుకకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.