'మాధవి గో బ్యాక్' - అరకు ఎంపీకి వైఎస్సార్సీపీ అసమ్మతి నేతల నిరసన సెగ - Goddeti Madhavi
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 3:19 PM IST
YSRCP Leaders Protest Against Araku MP Goddeti Madhavi: అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గ ఇంఛార్జ్ల మార్పులతో అధికార వైఎస్సార్సీపీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. పార్టీ కోసం పని చేసిన స్థానికులకు కాదని కొత్తవారిని తీసుకువచ్చి సమన్వయకర్తలుగా నియమించడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరికొంతమంది ఎక్కడికక్కడ తమ నిరసనను తెలుపుతున్నారు. తాజాగా అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీ గొడ్డేటి మాధవికి నిరసన సెగ తలిగింది.
నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు అధికార వైసీపీకి కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. అరకు ఎంపీ మాధవిని అసమ్మతి వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. అరకు అసెంబ్లీ సమన్వయకర్తగా ఎంపీ గొడ్డేటి మాధవి నియామకాన్ని స్థానిక వైసీపీ నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నారు. అరకులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మాధవిని అసమ్మతి నేతలు అడ్డుకున్నారు. మాధవి గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. దీంతో మాధవి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పరస్పరం తోపులాటకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.