thumbnail

YSRCP Fireworks in Front of TDP Protest Initiation Camp: వైసీపీ నేతల కవ్వింపు చర్య.. టీడీపీ దీక్షా శిబిరం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2023, 3:54 PM IST

YSRCP Fireworks in Front of TDP Protest Initiation Camp in Pithapuram : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు, నిరాహార దీక్ష కార్యక్రమాలు టీడీపీ నేతలు చేపట్టారు. కాగా, దీక్షా శిబిరాలపై వైసీపీ నేతలు దాడి (YSRCP Leaders Attack on TDP Protest Initiation Camp)  చేయడం పరిపాటిగా మారింది. అలాగే దీక్షను భగ్నం చేస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో శాంతియుతంగా నిరసన తెలుపతున్న టీడీపీ దీక్షా శిబిరం వద్ద బాణాసంచా కాల్చడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలివీ.. 

జిల్లాలోని పిఠాపురంలో వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. చంద్రబాబు అరెస్టునూ నిరసిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో దీక్షా శిబిరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ పట్టణ, మండల కమిటీ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం కోసం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మున్సిప‌ల్ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున దీక్షా శిబిరం వద్ద వైసీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బాణాసంచా కాల్పుల కారణంగా కార్యకర్తలకు గాయాలు అయ్యాయని వర్మ ఆరోపించారు. పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డుపై వర్మ బైఠాయించి సీఎం జగన్‌ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.