Yadavs Protested in Front of Collectorate విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగిన యాదవులు..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2023, 5:22 PM IST

thumbnail

Yadavs Protested in Front of Collectorate: కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటుకి తమ భూములను తీసుకోవద్దని కోరుతూ దత్తిరాజేరు మండలం చిన్న చామలాపల్లి గ్రామానికి చెందిన యాదవులు విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని చామలాపుల్లికిలో 50 ఎకరాల డీ పట్టా భూమి ఉంది. అందులో యాదవ కలస్తులు గొర్రెలు, మేకలు పెంచుతూ వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనం సాగిస్తున్నారు. ఆ భూమిలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వేను అధికారులతో పూర్తి చేయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని యాదవులు తీవ్రంగా వ్యతిరేకించారు. 150 కుటుంబాలకు జీవనాధారమైన ఈ భూమిలో కృషి విజ్ఞా కేంద్రం ఏర్పాటు చేస్తే వలసలు పెరిగే అవకాశం ఉందని ఆవేదన చెందారు. స్పందనలో మూడుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని యాదవులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.