thumbnail

By

Published : Jul 28, 2023, 3:44 PM IST

ETV Bharat / Videos

Telugu Student Died in London: రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి.. లండన్​ నుంచి స్వగ్రామానికి చేరుకున్న మృతదేహం

Telugu Student Kiran Kumar Died in London: ఉన్నత విద్య కోసమని విదేశాలకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లాడు ఓ విద్యార్థి. గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి గత నెల లండన్​లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడి చివరకు ప్రాణాలు వదిలాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన కిరణ్ కుమార్.. ఏలూరులో బీటెక్​ పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా పని చేసి.. ఎమ్మెస్​ చేయటానికి రెండు సంవత్సరాల క్రితం లండన్​ వెళ్లి ఉన్నత విద్యను పూర్తి చేశాడు. అక్కడే ఉంటూ ఉద్యోగ అన్వేషణ చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 26వ తేదీన ఓ దొంగను పోలీసులు పట్టుకునే నేపథ్యంలో.. ఆ దొంగ కారులో పారిపోతూ కిరణ్​ను వేగంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన కిరణ్​ను రాయల్​ వైద్యశాలలో చేర్పించగా.. మృత్యువుతో పోరాడుతూ మృతి చెందాడు. ఈ నెల 3వ తేదీన మరణించిన కిరణ్​ మృతదేహం గురువారం రాత్రి స్వగ్రామానికి తీసుకురావటంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.