వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు: బత్యాల చెంగల రాయుడు - YSRCP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 10:44 PM IST

TDP Bathyala Changal Rayudu Fires on CM Jagan: రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, రానున్న ఎన్నికలలో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం రాబోతోందని టీడీపీ నేత బత్యాల చెంగల రాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో బత్యాల చెంగల రాయుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో లిక్కర్, ఇసుక, మైనింగ్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలను దోచుకున్నారని అన్నారు. ఈ విధ్వంస అరాచక పాలనలో ప్రజలపై దాడులు ఎక్కువ అయ్యాయని మండిపడ్డారు. 

రాష్ట్రంలో పరిశ్రమలు రాక యువత నిరుద్యోగులుగా మారి రోడ్డున పడ్డారని అన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని అన్నారు. రా కదలి రా కార్యక్రమం ద్వారా వైసీపీ నేతల అవినీతిని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లానని అన్నారు. అలాగే టీడీపీ హయాంలో చేపట్టిన అభివృధి కార్యక్రమాల గురించి ప్రజలకు గుర్తు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.