తిరువూరు సభను విజయవంతం చేయడమే లక్ష్యం - చంద్రబాబును సీఎం చేయడమే ధ్యేయం : కేశినేని - విజయవాడ ఎంపీ టికెట్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-01-2024/640-480-20434638-thumbnail-16x9-keshineni-chinni.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 1:19 PM IST
Keshineni Chinni Respond on MP Keshineni Nani Post: తెలుగుదేశం అధినేత చంద్రబాబు తిరువూరు సభను విజయవంతం చేయడమే తమ లక్ష్యమని పార్టీ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) స్పష్టం చేశారు. పార్టీలో తాను ఒక సామాన్య కార్యకర్తనేనన్న ఆయన చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే తన ధ్యేయమని తెలిపారు. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు సహజమనీ, తిరువూరులో ఘటన కూడా అలాంటిదేనన్నారు. 7వ తేదీ సభకు లక్ష మంది పైగా ప్రజలు వస్తారని తెలిపారు. సోషల్ మీడియాలో కేశినేని నాని ఫేస్బుక్ పోస్ట్తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్పై ఎంపీ కేశినేని నానికి తెలుగుదేశం అధిష్ఠానం స్పష్టత ఇచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ ఇతరులకు ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించిందని తెలిపారు. ఇదే విషయాన్ని ఎంపీ కేశినేని నాని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అధినేత ఆదేశాలు శిరసా వహిస్తానని వెల్లడించారు.