Film Actress Krithi Shetty at Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతిశెట్టి, మంత్రి రోజా - Film actress Kriti Shetty news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 4:34 PM IST

Film Actress Krithi Shetty at Tirumala:  తిరుమల శ్రీవారిని సినీ నటి కృతిశెట్టి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం  హుండీలో కానుకలు సమర్పించిన కృతిశెట్టి.. మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది కృతిశెట్టికి(movie actress Krithi Shetty) స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన కృతితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా మాట్లాడిన కృతిశెట్టి.. తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 

AP Minister Roja Participated in Tirumala Srivari Seva : తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి రోజా(Minister Roja at Tirumala) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి రోజా  స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే (TTD) ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో.. రోజాకు  పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.