ఉద్యోగ ఉపాధ్యాయులపై వైసీపీ ప్రభుత్వ వైఖరి మారాలి: మాజీ ఎంపీ చింతా మోహన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 4:42 PM IST

thumbnail

 EX- MP Chintha Mohan Fires on YCP Government : రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులను వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేస్తోందని మాజీ ఎంపీ చింతా మోహన్ ధ్వజమెత్తారు.  ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో  సమావేశం నిర్వహించారు. నాలుగు లక్షల పైగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఉండగా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించ పోవడం దారుణమన్నారు. చదువు చెప్పే ఉపాధ్యాయులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు.

Teachers Old Pension Issue in Tirupati : చదువు చెప్పాల్సిన ఉపాద్యాయులతో  అడ్డమైన చాకిరి చేయించుకుంటున్నారన్నారు. ఉపాద్యాయుల పట్ల ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాలుగు లక్షలమంది ఉపాద్యాయులు ఉన్నా వారి డిమాండ్​ను పట్టించుకోకపోవడం అరాచకమన్నారు. వారికి  పాత పెన్షన్​ విధానాన్ని అమలు చెయ్యకపోవడం పట్ల చింతా మోహన్  అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకుని ఉపాద్యాయుల పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావడం పట్ల జాప్యం వీడాలని  మాజీ ఎంపీ చింతా మోహన్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.