CPI Ramakrishna Comments on YCP ఏపీలో అవినీతిపై వైసీపీ, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నాయి: సీపీఐ రామకృష్ణ - తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2023, 7:45 PM IST

 CPI Ramakrishna Comments on YCP: రాష్ట్రంలో వైసీపీ అవినీతి అక్రమాల గురించి సాక్ష్యాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లిన చర్యలు శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇప్పటికే లిక్కర్, ఇసుక, మైనింగ్ వంటి స్కాం అంశాలపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ ను కలిసి వినతిపత్రం ఇచ్చామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారన్నారు. కానీ, ఆమె ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇప్పటివరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేయలేదన్నారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నారని అర్థమవుతుందని రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు వైసీపీతో, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. దిల్లీలో లిక్కర్ స్కాం పై స్పందించిన బీజేపీ... రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతున్న ఎందుకు స్పందించడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడిపిస్తుందని ఆయన మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.