స్వచ్ఛతా ఉద్యమ్ యోజన - మురుగు శుద్ధి వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జగన్ - స్వచ్ఛతా ఉద్యమ్ యోజన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 2:00 PM IST

CM Jagan Started Sewage Treatment Vehicles: స్వచ్ఛతా ఉద్యమ్ యోజన పథకం కింద స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు చేసిన మురుగు శుద్ధి వాహనాలను సీఎం జగన్  జెండా ఊపి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి.. వాటిని వివిధ పురపాలికలు, కార్పొరేషన్లలోని సఫాయి కర్మచారీలకు పంపిణీ చేశారు. మొత్తం 100 మురుగు శుద్ధి యంత్రాలతో కూడిన వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జునతో పాటు.. పురపాలక, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్​ అధికారులు పాల్గొన్నారు. 

స్వచ్ఛతా ఉద్యమ్ యోజన పథకాన్ని సఫాయి కర్మచారీలకు జీవనోపాధిని అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. దీని ద్వారా పారిశుద్ధ్య సంబంధిత పరికరాలు, వాహనాల సేకరణకు ఈ పథకం ద్వారా నిధులను నేషనల్ సఫాయి కర్మచారీ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమాకూరుస్తోంది. ఇది పారిశుద్ధ్య సంబంధిత వంటి వాటికోసం పట్టణ, స్థానిక సంస్థలకు ఆర్థిక సహాయాన్ని సైతం అందిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.