అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన బైక్- ఇద్దరు మృతి - ఏలూరులో బైక్ ప్రమాదం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 4:25 PM IST
Bike Lost Control Crashed Into Well: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో నూతన సంవత్సరం వేళ విషాదఛాయలు అలుముకున్నాయి. కనసానపల్లిలో సోమవారం ఉదయం బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికిి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఒకరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. గ్రామ సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నున్న గ్రామానికి చెందిన శెట్టి సాయికుమార్ (24), తలసెల్ల కృష్ణ చైతన్య (24), రాకేష్ (25) ఏలూరు జిల్లాలో బందువులు ఇంటికి వచ్చారు. ఈ ముగ్గురు కలిసి ఆదివారం రాత్రి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని సోమవారం ఉదయం బైక్పై ఇంటిికి తిరిగివెళ్తుండగా బైక్ అదుపుతప్పింది. దీంతో బైక్తో సహా ముగ్గురూ నేలబావిలోకి దూసుకెళ్లారు. ప్రమాదం జరిగిన సమయంలో పొలంలో ఉన్న సర్పంచ్ ఇదంతా గమనించి బావి వద్దకు వెళ్లి చూడగా రాకేష్ నీటిపై తేలుతున్నారు. వెంటనే రాకేష్ను బయటకు తీసుకువచ్చారు.
స్థానికులు బావిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా ఒక యువకుడు దొిరికాడు. కాని అప్పటికే మృతి చెందాడని, మరో మృతదేహం కోసం బావిలో నీటిని తోడుతున్నారని సర్పంచ్ వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ను విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారన్నారు. ప్రస్తుతం రాకేేష్కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.