రాజకీయ నాయకుల నుంచి టెండర్లు- ఏఎస్సై విధుల నుంచి తొలగింపు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 12:02 PM IST

thumbnail

ASI Dismiss in YSR District : అవినీతి ఆరోపణలు రావడంతో వైఎస్సార్​ జిల్లా రైల్వే కొండాపురంలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సైపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.  వైఎస్సార్ జిల్లా రైల్వే కొండాపురంలో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఉత్తమారెడ్డిని విధుల నుంచి తొలగిస్తూ కర్నూల్ రేంజ్‌ డీఐజీ ఉత్తర్వులు  జారీ చేశారు. రాజకీయ నాయకుల నుంచి టెండర్లు, ప్రైవేటు చీటీలు నడపటం లాంటి పలు ఆరోపణలు ఏఎస్సై పై వచ్చాయి. దీంతో అతనిపై  విచారణకు  డీఎస్పీ  అధికారిని నియమించారు. ఏఎస్సైపై ఆరోపణలు రుజువు కావడంతో అతనిని విధుల నుంచి తొలగించారు.

Dismissal of ASI accused of committing irregularities in kondapur : రాజకీయ నాయకుల అండతో పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఉత్తమారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అతడిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కర్నూల్​ రేంజ్​ డీఐజీ ఓ డీఎస్పీని నియమించారు. ఏడాదిపాటు ఆయనపై నిఘా ఉంచిన అధికారులు ఆ ఆరోపణలు నిజమని తేలడంతో చర్యలు తీసుకున్నారు. అతనిని విధుల నుంచి తొలగించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.