కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం శివాజీ నగర్లో వారం రోజుల ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా యోగి వేమన విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం వాలంటీర్లు పాల్గొన్నారు. గ్రామంలోని ఆలయం పరిసరాలను, వైవీయూ గురుకుల భవనాలు, బొటానికల్ గార్డెన్ పరిసరాలను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను తొలగించారు.
వైవీయూఎస్ఎస్ యూనిట్- 1, 3 ప్రోగ్రామింగ్ ఆఫీసర్లు డాక్టర్ పి.సరిత, డాక్టర్ పి.వి. వర ప్రభాకర్ పర్యవేక్షించారు. స్థానికులకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం శివాజీనగర్లో ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: