ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తమకు సాయుధ రక్షణ కల్పించాలని కోరుతూ గతేడాది నవంబర్ 21న డీజీపీ గౌతమ్ సవాంగ్కు సునీత లేఖ రాశారు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని విన్నవిస్తూ... రెండ్రోజుల కిందట హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు... ఈ లేఖను ఆమె జతపరిచారు. వివేకా హత్య కేసులో కీలకమైన శ్రీనివాసరెడ్డి హత్య నేపథ్యంలో... పరమేశ్వరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, కాపలాదారు రంగయ్యల ప్రాణాలకూ ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. డీజీపీ, కడప ఎస్పీ కార్యాలయాల్లోనూ ఈ లేఖను స్వయంగా అందజేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: సీబీఐకి ఎందుకు అప్పగించట్లేదు?: వివేకా కుమార్తె