కడప జిల్లా బద్వేల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మరో వ్యక్తిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరిది రఘనాథపురం కాగా... మరొకరిది నాగిశెట్టిపల్లిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి