కడప రామరాజుపల్లికి చెందిన బి.బాబు కడపలో బీటెక్ పూర్తి చేశాడు. రెండున్నరేళ్ల కిందట బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేరాడు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో.. కరోనా భవిష్యత్తును కాటు వేసింది. ఉన్న ఉద్యోగం పోయింది. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవనం కష్టంగా మారింది. బెంగళూరు నుంచి కడపకు వచ్చేశారు. కుటుంబ పోషణకు వేరే మార్గం కనిపించలేదు. దీంతో గత్యంతరం లేక మామిడి పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఇదీ చదవండీ... వచ్చే నెలలో అమలు కానున్న పథకాలను ప్రకటించిన సీఎం