రైతన్న బిడ్డ తన ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు కి చెందిన సిరివెళ్ల సుచరిత ... తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ సెట్ ప్రవేశ ఫలితాల్లో... ఆహార సాంకేతిక విభాగంలో విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది.ఆమె తండ్రి రవి శేఖర్రెడ్డి రైతు కాగా... తల్లి శ్రీదేవి గృహిణి. సుచరిత 10 వరకు పొద్దుటూరు లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో, విజయవాడలో ఇంటర్మీడియట్, గుంటూరులో డిగ్రీ పూర్తీ చేసింది. తమ కుమార్తె ఉత్తమ ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆహార తనిఖీ అధికారి కావాలన్నదే ధ్యేయమని ఆమె చెప్తోంది.
ఇదీ చదవండీ...